IND vs ENG : టీమ్ఇండియాకు భారీ షాక్.. సిరీస్ నుంచి కీలక ఆటగాడు ఔట్! కోహ్లీ డౌట్!
టీమ్ఇండియాకు వరుస షాకులు తగులుతున్నాయి.
IND vs ENG 2nd Test : టీమ్ఇండియాకు వరుస షాకులు తగులుతున్నాయి. గాయాల కారణంగా ఒక్కొక్కరుగా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు దూరం అవుతున్నారు. విశాఖ వేదికగా శుక్రవారం నుంచి ఆరంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్కు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్లు దూరం అయ్యారు. రాజ్కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్టు నాటికి కేఎల్ రాహుల్ జట్టుతో కలవనున్నాడు.
జడేజా మాత్రం రాంచీ వేదికగా జరిగే నాలుగో టెస్టు మ్యాచ్కు అందుబాటులోకి రానున్నట్లు ఎన్సీఏ వర్గాలు వెల్లడించాయి. జడేజాకు అయిన గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పట్టనుందని తెలిపింది.
చీలమండ గాయంతో బాధపడుతున్న మహ్మద్ షమీ మొదటి రెండు టెస్టులకు దూరం అయిన సంగతి తెలిసిందే. మూడో టెస్టు మ్యాచ్ నుంచి అతడు అందుబాటులోకి వస్తాడని వార్తలు రాగా.. అది కష్టమేనని అంటున్నారు. ప్రస్తుతం షమీ లండన్లో స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడు ఇంగ్లాండ్తో సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండకపోవచ్చునని కథనాలు వస్తున్నాయి.
Joe Root : అరుదైన రికార్డుపై జో రూట్ కన్ను.. విశాఖ టెస్టులో అందుకునేనా..?
వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ మూడో టెస్టులోనైనా ఆడతాడో లేదా అన్నది సందిగ్థంగా ఉంది. అతడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి జనవరి 31 (బుధవారం ) మూడు, నాలుగు, ఐదు టెస్టులకు జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే.. కోహ్లీ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో సెలక్టర్లు జట్టును ప్రకటించలేదని వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచులో భారత్ 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో విశాఖ వేదికగా శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్టు మ్యాచులో విజయం సాధించాలని టీమ్ఇండియా పట్టుదలగా ఉంది. అయితే.. కీలక ఆటగాళ్లు గాయడడంతో యువ ఆటగాళ్లు తమ సత్తాను ఏ మేరకు నిరూపించుకుంటారో చూడాల్సిందే.
Ashwin : విశాఖ టెస్టు.. అశ్విన్ను ఊరిస్తున్న రికార్డులు ఏంటో తెలుసా..?