లోక్సభ అభ్యర్ధిగా మాజీ జేడీ లక్ష్మీనారాయణను ప్రకటిస్తే ప్రతిపక్షనేత జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డికి ఎందుకంత భయం? అంటూ నిలదీశారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరడంతో నీకిది-నాకది అంటూ టీడీపీ-జనసేన మధ్య ఫ్రెండ్లీ పోటీకి డీల్ కుదిరింది. వారి ఉమ్మడి ప్రత్యర్ధి జగన్ గారేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు విజయ్ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. లోక్సభ అభ్యర్ధిగా మాజీ జేడీ లక్ష్మీనారాయణను ప్రకటిస్తే ప్రతిపక్షనేత జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డికి ఎందుకంత భయం? అంటూ నిలదీశారు.
Read Also : పవన్ కళ్యాణ్ ఆస్తులు.. అప్పుల వివరాలు ఇవే!
నేరస్తులు, తప్పుడు పనులు చేసే వ్యాపారులు చట్టసభలకు వెళ్తే ప్రజలకు న్యాయం జరగదని, పులివెందులలో పుట్టిన మీరు ఏమన్నా పడతాం అనుకోవద్దు… నందికొట్కూరు దగ్గర ఉన్న కొణిదల గ్రామం పేరు ఇంటి పేరుగా ఉన్నవాడిని, కిరాయి రౌడీలు, వేల కోట్లు, ప్రైవేటు సైన్యాలు తమను ఏం చేయలేవన్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోబోమని, మహాత్మా గాంధీ, కాన్షీరాంల ఆశయాలతో ముందుకు వెళ్తున్నాం కదా అనుకుంటే.. అవసరమైతే నేతాజీ, భగత్ సింగ్ వారసులం అవుతాం అంటూ హెచ్చరించారు.
అలాగే 10వ తరగతి పాసైన నేను ప్రజల ముందు నిలబడి ఉన్నానని, సీఏ చదివిన విజయసాయి రెడ్డి సూట్ కేసు కంపెనీలు పెట్టి వేలకోట్లు ఎలా దోచేయాలో నేర్చుకున్నారంటూ ఎద్ధేవా చేశారు. తాను నేర్చుకున్న విలువలు నేరస్థులతో పోరాడమని ధైర్యాన్ని ఇస్తే.. ఆయన చదువు మాత్రం నేరం ఎలా చేయాలో నేర్పించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీకిది-నాకది థీరీని కనిపెట్టినవాడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. అప్పట్లో కుల మీడియా ఈ థీరీని ఊరూవాడా ప్రచారం చేసింది. జేడీ జనసేనలో చేరిన వెంటనే ఆ థీరీని ఆచరణలోకి తెచ్చారు. నీకిది-నాకది అంటూ టీడీపీ-జనసేన మధ్య ఫ్రెండ్లీ పోటీకి డీల్ కుదిరింది. వారి ఉమ్మడి ప్రత్యర్ధి జగన్ గారే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) 19 March 2019
Read Also : ఇప్పటివరకు రూ.14.67 కోట్లు పట్టివేత : లోక్సభ ఎన్నికలు