మళ్లీ దొరికేసాడు:  రైతులకు పసుపు-కుంకుమ పథకమట

  • Published By: veegamteam ,Published On : March 26, 2019 / 07:05 AM IST
మళ్లీ దొరికేసాడు:  రైతులకు పసుపు-కుంకుమ పథకమట

హరిపురం : మంత్రి లోకేశ్ మళ్లీ దొరికపోయాడు. కాగా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధా రంగానగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడున్న వారినుద్దేశించి మాట్లాడుతూ.. ఏప్రిల్‌ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయని, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. లోకేష్‌ వ్యాఖ్యలతో తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎన్నికలు తొమ్మిదో తేదీన కాదు, పదకొండున అని పక్కనే ఉన్న తెలుగు దేశం నాయకుడు బండి చిరంజీవి అందివ్వడంతో లోకేశ్‌ కవర్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా మందసం మండలంలోని విల్లుపురంలో మంత్రి లోకేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నోరు జారిన లోకేశ్ పసుపు-కుంకుమ పథకం కింద ప్రతీ రైతు కుటుంబానికి రూ.15వేలను సీఎం చంద్రబాబు ఇస్తున్నారని నోరు జారారు. ఏపీలోని ప్రతీ మహిళకు పసుపు-కుంకుమ పథకం కింద ఇచ్చే నగదును రైతులకు ఇస్తున్నాం అంటు లోకేశ్ మాట జారారు. 2014లో రూ.2 వందలను రూ.2వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకునే  ఏ రాష్ట్రాల్లోను ఈ పెన్షన్ ఇవ్వటంలేదన్నారు. రానున్న రోజుల్లో ఈ పెన్షన్ రూ. 3 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. 

పసుపు-కుంకుమ అందించినా గెలిపిస్తామా లేదా పసుపు-కుంకమలు చెరిపేసిన వ్యక్తిని గెలిస్తామా అనే విషయాన్ని ప్రతీ ఒక్కరు ఆలోచించి ఎన్నికల్లో ఓట్లు వేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ఇలా ప్రజలకు ఉపయోగపడే 120 సంక్షేమ పథాకాలను అమలు చేసే ఘనత మన సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. గతంలో ఉండే విద్యుత్ కష్టాలను కూడా అధిగమించామనీ..దాంట్లో భాగంగా 24 గంటల విద్యుత్ అందిస్తున్నామనీ..ప్రతీ ఇంటికీ పెద్ద కొడుకుగా ఉండి వారి అవసరాలను తీరుస్తు ఆర్థిక కష్టాల్లో కూడా సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్న ఘనత మన ఏపీ ప్రభుత్వానిదనీ..దాని కోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారీ రాష్ట్రం అభివృద్ధిని కోరుకునే ప్రతీ ఒక్కరూ మరోసారి చంద్రన్నకు ఓటేసి గెలిపించాలని మంత్రి లోకేశ్ హరిపురం ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరారు.