జియో రీఛార్జ్ కోసం పేటీఎమ్ డిస్కౌంట్ ఆఫర్
టెలికాంలో అగ్రగామిగా మారిన జియో ఐయూసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్యాక్ల రేట్లు పెరిగిపోయాయి. రూ.399 రీచార్జ్కు 1.5జీబీ ఇస్తున్న జియో.. ఐయూసీలు కూడా కలిపి అదనంగా తీసుకుంటుంది. ఈ స్కీం వచ్చిన తర్వాత ఆల్ ఇన్ వన్ ప్యాక్ అంటూ రూ.444, రూ.555లతో సిద్ధమైంది జియో.
మునుపటి కంటే డేటా ఎక్కువ వస్తున్నప్పటికీ రూ.45అదనంగా కట్టాల్సి వస్తుందని బాధపడుతున్న వారికి జియో బంపర్ ఆఫర్ ఇచ్చింది. రిలయన్స్ సంస్థ పేటీఎమ్తో టై అప్ అయి ఆఫర్లు తీసుకొచ్చింది. అది కేవలం రూ.444, రూ.555ప్యాక్ లకు మాత్రమే. ఇదేదో క్యాష్ బ్యాక్ ఆఫర్ కాదు. నేరుగా చెల్లించాల్సిన అమౌంట్లోనే డిస్కౌంట్ వస్తుంది.
రూ.444ప్యాక్ కోసం SHUBHP44 అనే ప్రొమో కోడ్ అప్లై చేస్తే కేవలం రూ.400చెల్లిస్తే సరిపోతుంది. అదే రూ.555ప్యాక్ కోసం SHUBHP50 చెల్లిస్తే రూ.505 చెల్లించాలి. షుబ్ పేటీఎమ్ ఆఫర్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేటీఎమ్ ఈ ఆఫర్ ప్రకటించింది. రూ.444ప్యాక్ తో రోజుకు 2జీబీ డేటా, జియో టు జియో అన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్ వర్క్ లు మాట్లాడేందుకు వెయ్యి నిమిషాలు వస్తాయి. అదే రూ.555 ప్యాక్ తీసుకుంటే రోజుకు 2జీబీ డేటా, జియో టు జియో అన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్ వర్క్ లు మాట్లాడేందుకు 3వేల నిమిషాలు వస్తాయి.
ఈ ప్యాక్ లు వాడే వారు ఐయూసీ టాప్ అప్ ప్రత్యేకంగా రీచార్జ్ చేయించుకోనవసర్లేదు. వొడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఇతర టెలికాం ఆపరేటర్లకు మాట్లాడేసుకోవచ్చు.