Rohit Sharma: 190 పరుగులు బాదుతామని ఊహించలేదు: రోహిత్ శర్మ
''అధిక పరుగులు రాబట్టడం కష్టమేనని అనుకున్నాము. ఇక్కడ మొదట్లో భారీ షాట్లు కొట్టడం సులువైన విషయం ఏమీ కాదు. క్రీజులో నిలదొక్కుకుని భారత బ్యాట్స్మెన్ అద్భుతంగా రాణించారు. మొదటి 10 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేసిన తీరును చూసి, ఈ మ్యాచులో మేము 190 పరుగులు రాబట్టలేమని అనుకున్నాము. కానీ, మా కుర్రాళ్ళు అద్భుతంగా ఆడారు'' అని రోహిత్ శర్మ చెప్పాడు.
Rohit Sharma: వెస్టిండీస్తో నిన్న జరిగిన తొలి టీ20లో టీమిండియా 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో రోహిత్ శర్మ 64 పరుగులు చేశాడు. భారత్ 6 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. నిన్నటి మ్యాచ్లో టీమిండియా చేసిన పరుగుల గురించి కెప్టెన్ రోహిత్ స్పందించాడు. 190 పరుగులు చేయగలమని తాము ముందు అనుకోలేదని చెప్పాడు.
”అధిక పరుగులు రాబట్టడం కష్టమేనని అనుకున్నాము. ఇక్కడ మొదట్లో భారీ షాట్లు కొట్టడం సులువైన విషయం ఏమీ కాదు. క్రీజులో నిలదొక్కుకుని భారత బ్యాట్స్మెన్ అద్భుతంగా రాణించారు. మొదటి 10 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేసిన తీరును చూసి, ఈ మ్యాచులో మేము 190 పరుగులు రాబట్టలేమని అనుకున్నాము. కానీ, మా కుర్రాళ్ళు అద్భుతంగా ఆడారు. బ్యాటింగ్ ఎలా చేయాలన్న విషయంపై పునరాలోచన చేశాం. అద్భుతంగా రాణించాం. వెస్టిండీస్లో ఆడడం అంటే నాకు చాలా ఇష్టం. టీమిండియాకు ఇక్కడ మనవాళ్ళ నుంచి మంచి మద్దతు వస్తుంది. మ్యాచ్ చూడడానికి మనవాళ్ళు అమెరికా నుంచి వస్తారు. అలాగే, ఇక్కడ ఉన్న మనవాళ్ళు కూడా చాలా మంది వస్తారు” అని రోహిత్ శర్మ చెప్పాడు.
Kerala: యూట్యూబ్లో చూసి మద్యం తయారు చేసిన బాలుడు.. తాగి ఆసుపత్రిలో చేరిన అతడి స్నేహితుడు