India vs New Zealand: టీమిండియా విజయంపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందన
న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో టీమిండియా 1-0 తేడాతో గెలిచిన నేపథ్యంలో దీనిపై భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ‘‘నేటి గేమ్ లో గెలిచేవాళ్లం. మరోలా జరిగింది. ట్రోఫీ గెలిచి, విజయంతో వెనక్కు వెళ్తామన్న విషయం గురించి ఆలోచించలేదు’’ అని హార్దిక్ పాండ్యా అన్నాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు బౌలింగ్ అద్భుతంగా వేశారని, టీమిండియా కొన్ని వికెట్లు కోల్పోయినప్పటికీ పవర్ ప్లేలో రాణించామని చెప్పాడు.
India vs New Zealand: న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో టీమిండియా 1-0 తేడాతో గెలిచిన నేపథ్యంలో దీనిపై భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ‘‘నేటి గేమ్ లో గెలిచేవాళ్లం. మరోలా జరిగింది. ట్రోఫీ గెలిచి, విజయంతో వెనక్కు వెళ్తామన్న విషయం గురించి ఆలోచించలేదు’’ అని హార్దిక్ పాండ్యా అన్నాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు బౌలింగ్ అద్భుతంగా వేశారని, టీమిండియా కొన్ని వికెట్లు కోల్పోయినప్పటికీ పవర్ ప్లేలో రాణించామని చెప్పాడు.
బ్యాట్స్ మెన్ అందరికీ మంచి అవకాశాన్ని ఇచ్చేలా నేటి మ్యాచు జరిగిందని అన్నాడు. తాను ఇక ఇంటికి వెళ్తున్నానని, తన కుమారుడితో కలిసి ఇంట్లో ఉంటానని చెప్పాడు. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్ బాగా జరుగుతుందని వ్యాఖ్యానించాడు. కాగా, టీ20లకు మాత్రమే హార్దిక్ పాండ్యా సారథ్య బాధ్యతలు వహిస్తున్నాడు.
న్యూజిలాండ్ సిరీస్ లో వన్డేలకు శిఖర్ ధావన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడు. కాగా, ఇవాళ భారత్-న్యూజిలాండ్ మధ్య నేపియర్లోని మెక్లీన్ పార్క్ లో జరిగిన చివరి టీ20 డక్వర్త్ లూయిస్ నిబంధనతో టైగా ముగిసిన విషయం తెలిసిందే. భారత్ ముందు న్యూజిలాండ్ 161 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించగా, లక్ష్య ఛేదనలో భారత్ 9 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసిన సమయంలో వర్షం పడింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని తేల్చారు.
Winners are grinners ??#TeamIndia #NZvIND pic.twitter.com/vs7orTI1l3
— BCCI (@BCCI) November 22, 2022
Post-win handshakes and smiles as #TeamIndia sign off from Napier with a series win ??#NZvIND pic.twitter.com/jjGd2RfPv3
— BCCI (@BCCI) November 22, 2022
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..