ఐదురోజుల క్రితం అదృశ్యమైన బాలుడు హత్య !

  • Published By: veegamteam ,Published On : August 30, 2019 / 11:22 AM IST
ఐదురోజుల క్రితం అదృశ్యమైన బాలుడు హత్య !

గుంటూరు జిల్లా గురజాలలో దారుణం జరిగింది. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల నన్నపురెడ్డి సుభాష్ అనే బాలుడు హత్యగావించబడ్డాడు. బాలుడి ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో రక్తం మరకలతో షర్ట్, నిక్కర్ తోపాటు బాలుడికి సంబంధించిన పుర్రె, ఎముకల ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. లభ్యమైన షర్ట్, నిక్కర్ తమ కుమారుడివేనని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు.

దుండగుడు అత్యంత కిరాతకంగా నరికి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. క్లూస్, డాగ్ స్క్వాడ్ టీమ్స్ ను రప్పించి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే అక్కడ మృతదేహం లేకపోవడంతో డీఎన్ ఏ టెస్టు చేసే పనిలో నిమగ్నమయ్యారు. 

మరోవైపు సుభాష్ హత్యకు గురి కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాలుడు ఆచూకీ తెలియకపోవడంతో బోరున విలపిస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాలతో మరింత ఆందోళన చెందుతున్నారు. బాలున్ని ఎవరన్న హత్య చేసి ఉంటారేమోనన్న పోలీసుల అనుమానాలతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డ ప్రాణాలతోనే ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. గతంలో వివాదాలు ఏమైనా ఉన్నాయా, ఆస్తి తగాదాలు ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తున్నారు. అయితే బాలుడి శవం దొరక్కపోవడంతో దీన్ని ఏ విధంగా చూడాలన్న సందిగ్ధంలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : జగన్ సంచలన నిర్ణయం : ఏపీ గ్రామాల్లో మహిళా పోలీసులు