Veera Simha Reddy : వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వారిని రావొద్దంటూ హెచ్చరిక..
నందమూరి నటసింహ బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్తో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. మలినేని గోపీచంద్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్దమవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వారిని రావోదంటూ హెచ్చరిక జారీ చేసింది చిత్ర యూనిట్.
Veera Simha Reddy : నందమూరి నటసింహ బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్తో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. మలినేని గోపీచంద్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్దమవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వారిని రావోదంటూ హెచ్చరిక జారీ చేసింది చిత్ర యూనిట్.
Veera Simha Reddy: వీరసింహుడి ఉగ్రరూపం.. ట్రైలర్ రిలీజ్కు ముహూర్తం ఫిక్స్!
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని మొదటిగా ఒంగోలు నగరం నడిబొడ్డున ఏఎంబి గ్రౌండ్స్లో ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీఓ వలన అక్కడ అనుమతి లభించలేదు. ఆ తరువాత పోలిసుల అనుమతితో ఒంగోలులోనే అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్లో వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కానీ అక్కడ కూడా కొన్ని ఆంక్షాలతో కూడిన అనుమతే లభించింది.
దీంతో చిత్ర యూనిట్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ క్రమంలోనే వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిల్లలు, వృద్ధులను వెంట తీసుకురావద్దని నందమూరి అభిమానులకు చిత్ర బృందం ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. భారీ జన సమూహం జరుగుతుండడంతో భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నాము. దయచేసి సహకరించండి అంటూ విజ్ఞప్తి చేసింది చిత్ర బృందం.