Boy Died Warangal : వరంగల్‌లో విషాదం.. గొంతులో చాక్లెట్‌ ఇరుక్కుని బాలుడు మృతి

వరంగల్‌లో విషాదం నెలకొంది. చాక్లెట్ ఓ బాలుడి ప్రాణం తీసింది. గొంతులో చాక్లెట్‌ ఇరుక్కుని ఓ బాలుడు మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Boy Died Warangal : వరంగల్‌లో విషాదం.. గొంతులో చాక్లెట్‌ ఇరుక్కుని బాలుడు మృతి

boy died

Boy Died Warangal : వరంగల్‌లో విషాదం నెలకొంది. చాక్లెట్ ఓ బాలుడి ప్రాణం తీసింది. గొంతులో చాక్లెట్‌ ఇరుక్కుని ఓ బాలుడు మృతి చెందాడు. రాజస్థాన్‌కు చెందిన కంగర్‌సింగ్‌ గత కొంతకాలంగా వరంగల్‌లోని డాల్ఫిన్‌ గల్లీలో నివాసిస్తున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎలక్ట్రానిక్‌ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఇటీవలే కంగర్‌సింగ్‌ ఆస్ట్రేలియా వెళ్లొచ్చారు. ఆయన అక్కడి నుంచి విదేశీ చాక్లెట్లు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం పిల్లలు స్కూల్‌కు వెళ్తుండగా ఆ చాక్లెట్లను వారికి ఇచ్చారు. వారిలో రెండో తరగతి చదువుతున్న కుమారుడు సందీప్‌ (8) స్కూల్‌కు వెళ్లిన తర్వాత చాక్లెట్‌ను నోట్లో వేసుకున్నాడు.  అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక సందీప్‌ కిందపడిపోయాడు.

Boy Shot Dead: చిన్నారుల దొంగ-పోలీస్ ఆట.. తుపాకితో కాల్చడంతో బాలుడు మృతి

గుర్తించిన పాఠశాల సిబ్బంది బాలుడిని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తండ్రి కంగర్‌సింగ్‌కు సమాచారం అందించారు. డాక్టర్లు బాలుడి గొంతులో చాక్లెట్‌ను గుర్తించారు. చికిత్స అందిస్తుండగానే ఆ చిన్నారి మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.