Wife Murder Husband : వామ్మో.. ప్రియుడి మోజులో భర్తను చంపి శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టిన భార్య.. నాలుగేళ్ల తర్వాత వెలుగులోకి

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం మోజులో ఓ మహిళ కట్టుకున్న భర్తనే చంపేసింది. శవాన్ని ఇంట్లోనే పాతి పెట్టింది. నాలుగేళ్ల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Wife Murder Husband : వామ్మో.. ప్రియుడి మోజులో భర్తను చంపి శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టిన భార్య.. నాలుగేళ్ల తర్వాత వెలుగులోకి

Wife Murder Husband : వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. వివాహేతర సంబంధం కోసం దారుణాలకు ఒడిగడుతున్నారు. కట్టుకున్న భార్యను భర్త, భర్తను భార్య కడతేరుస్తున్నారు. తమ సుఖం కోసం మర్డర్లు కూడా చేస్తున్నారు.

తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం మోజులో ఓ మహిళ కట్టుకున్న భర్తనే చంపేసింది. శవాన్ని ఇంట్లోనే పాతి పెట్టింది. చివరికి ఆమె పాపం పండింది. నాలుగేళ్ల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం హత్య జరగ్గా.. కేసును పోలీసులు చేధించారు. కేసులో మృతుడి భార్యతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ పరిధిలో చంద్ర వీర్, సవిత దంపతులు నివసిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సవితకు అరుణ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

దీంతో ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. 2018లో అరుణ్, సవిత కలిసి.. చంద్రవీర్‌ను తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం కేసుకప్పి పుచ్చేందుకు.. చంద్ర వీర్ మృతదేహాన్ని అరుణ్ ఇంట్లో ఏడు అడుగుల గొయ్యి తీసి పాతిపెట్టారు. తర్వాత పైన సిమెంట్ ప్లోరింగ్ వేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అనంతరం తన భర్తను బంధువులు కిడ్నాప్ చేశారంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు.. అప్పటి నుంచి ఈ కేసులో ఎలాంటి ఆధారాలూ లభించలేదు. అయితే తాజాగా లభించిన కొన్ని ఆధారాల ద్వారా లోతుగా దర్యాప్తు చేయగా.. షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. చివరకు అరుణ్, సవితను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించగా నేరం అంగీకరించారు. దీంతో పోలీసులు వారిని జైలుకి తరలించారు. ప్రియుడి మోజులో భార్యే భర్తను హత్య చేసిందని తెలుసుకుని మృతుడి బంధువులు షాక్ అయ్యారు.

పోలీసుల విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. భర్తను చంపిన భార్య శవాన్ని తన ప్రియుడి ఇంట్లో గుంత తీసి పాతి పెట్టింది. ఆ తర్వాత గుంతను పూడ్చి దానిపై సిమెంట్ ఫ్లోరింగ్ వేశారు. ఆ తర్వాత అదే ఇంట్లో ప్రియుడు అరుణ్ నివాసం ఉండసాగాడు. కాగా, ఈ గుంతను నిందితులు ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచారు. భర్తను చంపేయగానే శవాన్ని ఆ గుంతలో పూడ్చాలని భార్య స్కెచ్ వేసింది.

పోలీసులకు చిక్కకుండా నిందితులు చాలా తెలివిగా ప్లాన్ చేశారు. ఇంట్లో ఏడు అడుగుల లోతు గుంత తవ్వారు. అందులో శవాన్ని పాతిపెట్టారు. దుర్వాసన రాకుండా ఉండేందుకు ఏడు అడుగుల లోతైన గుంత తవ్వారని తెలుసుకుని పోలీసులే అవాక్కయారు. హత్యకు వాడిన తుపాకీ, గొడ్డలిని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.