Minor Gang Raped : దారుణం.. మైనర్ బాలికపై 8మంది గ్యాంగ్ రేప్.. వీడియో తీసి బ్లాక్‌మెయిల్

నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఎన్ని తెచ్చినా.. మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

Minor Gang Raped : దారుణం.. మైనర్ బాలికపై 8మంది గ్యాంగ్ రేప్.. వీడియో తీసి బ్లాక్‌మెయిల్

Minor Gang Raped : నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఎన్ని తెచ్చినా.. మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఆఖరికి చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. భయపెట్టో, బ్లాక్ మెయిల్ చేసో అత్యాచారాలకు తెగబడుతున్నారు. రాజస్తాన్ అల్వార్ లో అలాంటి ఒక దారుణం జరిగింది.

16ఏళ్ల బాలిక ప్రైవేట్ ఫోటోలు తీసిన కొందరు నీచులు.. ఆ ఫోటోలతో ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేశారు. బాలికను నిర్మానుష్య ప్రదేశానికి రప్పించి 8 మంది అత్యాచారం చేశారు. ఈ దారుణాన్ని వీడియో తీశారు. ఆ తర్వాత దాన్ని అడ్డు పెట్టుకుని పలుమార్లు అత్యాచారం చేశారు. బాలికతో డబ్బు కూడా తీసుకున్నారు. కాగా, ఆ నీచులు మరింత బరితెగించారు. బాలిక దగ్గర డబ్బు లేకపోవడంతో వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నిందితులు బాలికను 50వేలు డిమాండ్ చేశారని పోలీసుల విచారణలో తెలిసింది. బాలిక ప్రైవేట్ ఫోటోలు తీసిన నిందితులు.. బాలికను బ్లాక్ మెయిల్ చేశారు. ఆ ఫోటొలు లీక్ చేయకుండా ఉండాలంటే రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ లో బాలికను నిర్మానుష్య ప్రదేశానికి రప్పించారు. అక్కడ అత్యాచారం చేశారు. ఆ తర్వాత బాలిక స్పృహ తప్పింది. అక్కడే గంట సేపు అలాగే ఉంది. బాలికను రేప్ చేసిన నీచులు అదంతా వీడియో తీశారు. ఆ వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు తీసుకున్నారు. అయితే బాలిక దగ్గర డబ్బు లేకపోవడంతో ఆ నీచులు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

బాలికను బ్లాక్ మెయిల్ చేసిన నిందితులు పలుమార్లు రేప్ చేశారు. జనవరి 3న ఒకసారి, ఏప్రిల్ 6న మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డారు. కొన్ని రోజుల తర్వాత బాలిక వారికి రూ.50వేలు ఇచ్చింది. తనను వదిలేయాలని వేడుకుంది. కానీ, ఆ నీచులు మరింత బరితెగించారు. ఈసారి 2లక్షల 50వేలు డిమాండ్ చేశారు. తన దగ్గర అంత డబ్బు లేదని బాలిక చెప్పడంతో.. వాళ్లు ఈ వీడియోను సోషల్ మీడియాలో లీక్ చేశారు. ఈ వీడియో బాలిక తల్లిదండ్రులు చూడటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన వెంటనే నిందితులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.