Nikki Yadav Murder: నిక్కీ యాదవ్ హత్య కేసులో ట్విస్ట్.. రెండేళ్లక్రితమే పెళ్లి చేసుకున్న జంట

నిక్కీ యాదవ్‌- సాహిల్ గెహ్లాట్ సహజీవనం చేశారని అందరూ భావిస్తుండగా, వాళ్లిద్దరూ గతంలోనే పెళ్లి చేసుకున్నారని తాజాగా తేలింది. 2020 అక్టోబర్‌లో నోయిడాలోని ఒక గుడిలో వీరు వివాహం చేసుకున్నారు. ఈ విషయం సాహిల్ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. అయితే, వాళ్లు ఈ పెళ్లికి అంగీకరించలేదు.

Nikki Yadav Murder: నిక్కీ యాదవ్ హత్య కేసులో ట్విస్ట్.. రెండేళ్లక్రితమే పెళ్లి చేసుకున్న జంట

Nikki Yadav Murder: ఇటీవల ఢిల్లీలో జరిగిన నిక్కీ యాదవ్ హత్య కేసులో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిక్కీ యాదవ్‌- సాహిల్ గెహ్లాట్ సహజీవనం చేశారని అందరూ భావిస్తుండగా, వాళ్లిద్దరూ గతంలోనే పెళ్లి చేసుకున్నారని తాజాగా తేలింది.

Cheetahs: దక్షిణాఫ్రికా నుంచి ఎగిరొచ్చిన చీతాలు.. కునో నేషనల్ పార్కులోకి విడుదల చేసిన ఎంపీ సీఎం, కేంద్ర మంత్రి

2020 అక్టోబర్‌లో నోయిడాలోని ఒక గుడిలో వీరు వివాహం చేసుకున్నారు. ఈ విషయం సాహిల్ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. అయితే, వాళ్లు ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తాజాగా ఈ నెల 9న వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. నిక్కీ-సాహిల్ రహస్యంగా వివాహం చేసుకుని కలిసే ఉంటుండగా, అతడు మరో పెళ్లికి సిద్ధపడటంపై నిక్కీ అతడ్ని ప్రశ్నించింది. ఈ విషయంలో ఇరువురి మధ్యా వాగ్వాదం జరిగింది. దీంతో ఫిబ్రవరి 9 రాత్రి నిక్కీ యాదవ్‌ను సాహిల్ హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని తను నిర్వహిస్తున్న దాబాలోని ఫ్రిజ్‌లో దాచి ఉంచాడు.

Nadda on Religious Issues: బాంబ్ పేల్చిన బీజేపీ చీఫ్.. ఎంపీలు, నాయకులు మతపరమైన కామెంట్స్ చేయొద్దంటూ వార్నింగ్

అనంతరం అతడి కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ హత్య విషయం ఫిబ్రవరి 14న వెలుగు చూసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు నిందితుడు సాహిల్‌ను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సాహిల్ కీలక విషయాలు వెల్లడించాడు. తనకు నిక్కీతో 2020లోనే పెళ్లైనట్లు చెప్పాడు. అంతేకాదు.. నిక్కీ హత్య విషయం తన తండ్రికి, కుటుంబ సభ్యులకు కూడా తెలుసని వెల్లడించాడు. దీంతో హత్యకు సహకరించిన కారణంగా సాహిల్ తండ్రిని, ఇద్దరు బంధువులు అశిష్, నవీన్, ఇద్దరు స్నేహితులు అమర్, లోకేష్‌ను అరెస్ట చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో నవీన్ ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తుండటం విశేషం.