Jharkhand: పెరుగుతున్న శ్రద్ధా తరహా హత్యలు.. భార్యను చంపి 12 ముక్కలు చేసిన భర్త

శ్రద్ధా తరహాలోనే హత్య చేసి, మృతదేహాల్ని ముక్కలు చేయడం ఇటీవల బాగా పెరిగిపోతోంది. తాజాగా ఝార్ఖండ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన భార్యను చంపి, 12 ముక్కలుగా నరికాడు.

Jharkhand: పెరుగుతున్న శ్రద్ధా తరహా హత్యలు.. భార్యను చంపి 12 ముక్కలు చేసిన భర్త

Jharkhand: శ్రద్ధా వాకర్ హత్య తర్వాత అలాంటి ఘటనలే అనేకం వెలుగు చూస్తున్నాయి. అనేక చోట్ల హత్యలు చేసిన నిందితులు మృతదేహాల్ని ముక్కలుముక్కలుగా నరుకుతున్నారు. ఇటీవలే రాజస్థాన్‌లో ఒక వ్యక్తి తన మేనత్తను హత్య చేసి, మృతదేహాన్ని పది ముక్కలుగా నరికి అనేక చోట్ల పడేశాడు.

Father Killed Daughter : అతిగా ఫోన్ మాట్లాడుతుందని.. కూతురును హత్య చేసిన తండ్రి

తాజాగా ఝార్ఖండ్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఝార్ఖండ్, షేబ్గంజ్ ప్రాంతం, బొరియో పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి తన భార్యను చంపి, 12 ముక్కలుగా నరికాడు. రుబికా పహదిన్ (22) అనే మహిళను దిల్దార్ అన్సారి అనే వ్యక్తి కొంతకాలం క్రితం పెళ్లి చేసుకున్నాడు. రుబికా అతడికి రెండో భార్య. ఈ క్రమంలో వారి మధ్య వైవాహిక జీవితానికి సంబంధించి విబేధాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ గొడవల కారణంగా రుబికాపై కోపం తెచ్చుకున్న అన్సారి ఆమెను గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని 12 ముక్కలుగా నరికాడు. వాటిని ఊరి అవతల ఒక పాత ఇంట్లో పడేశాడు. కొద్ది రోజులుగా రుబికా కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Father Suicide : గుజరాత్ లో విషాదం.. కూతురి కాలేజీ ఫీజు చెల్లించలేక తండ్రి ఆత్మహత్య

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపగా భర్తపై అనుమానం వచ్చింది. దీంతో అతడిని పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రుబికా శరీర భాగాల్ని స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ, ఇంకా కొన్ని శరీర భాగాలు దొరకాల్సి ఉంది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.