డీకే అరుణ బాటలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి?

  • Published By: veegamteam ,Published On : March 22, 2019 / 06:28 AM IST
డీకే అరుణ బాటలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి?

తెలంగాణ కాంగ్రెస్ కు ఏమైంది.. ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నా అధిష్టానం ఎందుకు మౌనంగా ఉంటుంది.. రాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలు ఏం చేస్తున్నారు ఇదే అందరిలో చర్చనీయాంశం అయ్యింది. మొన్నటికి మొన్న సబితా ఇంద్రారెడ్డి, నిన్న డీకే అరుణ.. ఇవాళ సునీతా లక్ష్మారెడ్డి. ఇలా ఒక్కొక్క మహిళా సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
Read Also : ప్రకాశం రచ్చ : వల్లూరమ్మ గుడిలో దామచర్ల – బాలినేని వర్గాల ఘర్షణ

సీనియర్ మహిళా నేత, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని.. త్వరలోనే బీజేపీలో చేరతారని ఆమె అనుచరులు అంటున్నారు. ఈ క్రమంలోనే తన స్నేహితురాలు డీకే అరుణతో భేటీ అయ్యారు. చాలాసేపు చర్చించారు. ఇటీవలే ఈమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

బీజేపీలో చేరితే మంచి భవిష్యత్ ఉంటుందని డీకే అరుణ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లోనే లోక్‌సభ టికెట్ ఇస్తామని హామీ కూడా సునీతా లక్ష్మారెడ్డికి లభించినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.
Read Also : వీధుల్లో కొట్టుకున్నారు : ఉండిలో టీడీపీ – వైసీపీ రాళ్ల దాడులు