మైహోం కొత్త వెంచర్‌ : కోకాపేటలో తర్‌క్ష్య(TARKSHYA) పేరుతో అపార్ట్ మెంట్ల నిర్మాణం

గృహ నిర్మాణ రంగంలో అగ్రగామి మైహోమ్‌ గ్రూప్(My Home Group)‌.. మరో ప్రతిష్ట్మాత్మక ప్రాజెక్టును చేపట్టింది. హైదరాబాద్ కోకాపేటలో.. తర్‌క్ష్య(TARKSHYA) పేరుతో భారీ

  • Published By: veegamteam ,Published On : February 9, 2020 / 07:16 AM IST
మైహోం కొత్త వెంచర్‌ : కోకాపేటలో తర్‌క్ష్య(TARKSHYA) పేరుతో అపార్ట్ మెంట్ల నిర్మాణం

గృహ నిర్మాణ రంగంలో అగ్రగామి మైహోమ్‌ గ్రూప్(My Home Group)‌.. మరో ప్రతిష్ట్మాత్మక ప్రాజెక్టును చేపట్టింది. హైదరాబాద్ కోకాపేటలో.. తర్‌క్ష్య(TARKSHYA) పేరుతో భారీ

గృహ నిర్మాణ రంగంలో అగ్రగామి మైహోమ్‌ గ్రూప్(My Home Group)‌.. మరో ప్రతిష్ట్మాత్మక ప్రాజెక్టును చేపట్టింది. హైదరాబాద్ కోకాపేటలో.. తర్‌క్ష్య(TARKSHYA) పేరుతో భారీ ప్రాజెక్టును తీసుకురానుంది. ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌కు దగ్గరలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో ఎన్నో అత్యద్భుతమైన.. అత్యాధునిక వసతులతో నాలుగు హై బ్లాక్స్‌లో 660 అపార్ట్‌ మెంట్లు అందుబాటులోకి రానున్నాయి.

అందమైన ఇంటిని కొనుక్కోవాలన్నది ఎంతో మంది కల. నాణ్యమైన నిర్మాణాలు.. మెరుగైన వసతులతో కూడిన ఇంటి కోసం ప్రతి ఒక్కరి అన్వేషణ ఎడతెరిపి లేకుండా సాగుతూనే ఉంటుంది. వీరందరి అన్వేషణకు చిరునామా కాబోతోంది.. మైహోం గ్రూప్‌ నిర్మిస్తున్న తర్‌క్ష్య. హైదరాబాద్‌లో ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టుల ద్వారా వినియోగదారుల ఆదరాభిమానాలను చూరగొన్న మైహోం గ్రూప్..ఇప్పుడు తర్‌క్ష్య అపార్ట్‌మెంట్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తోంది. సోమవారం ఈ ప్రాజెక్టు భూమిపూజ మహోత్సవం జరగనుంది. 

కోకాపేటలో 4 స్కై హై బ్లాకుల నిర్మాణం:
హైదరాబాద్ గచ్చిబౌలికి దగ్గర కోకాపేటలో తర్‌క్ష్య ప్రాజెక్టును నిర్మిస్తోంది మైహోం గ్రూప్‌. తర్‌క్ష్య అంటే గరుడపక్షి. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడికి హిందూ పురాణాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. గరుడపక్షి తన నిఘా కళ్లతో ఎలా చూస్తుందో.. సొంతింటిని సమకూర్చుకోవాలనుకునే వారు సైతం.. సరైన ఇంటి కోసం అన్వేషిస్తుంటారు. అలాంటి వారికి సరైన ఎంపిక కానుంది తర్‌క్ష్య.  

660 విశాలమైన అపార్టుమెంట్లు:
ప్రపంచస్థాయి ప్రమాణాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తర్‌క్ష్య ప్రాజెక్టును చేపట్టింది మైహోం గ్రూప్‌. అన్ని అనుమతులతో మొత్తం 5.82 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరగనుంది. ఇందులో జీ ప్లస్‌ 32 ఫ్లోర్లతో నాలుగు స్కై హై బ్లాక్స్‌ను నిర్మించనున్నారు. వీటిల్లో మొత్తం 660 విశాలమైన అపార్టుమెంట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రతి బ్లాక్ లో ఒక ఎంట్రన్స్ లాంచ్ ఉంటుంది. ప్రతి బ్లాక్ గ్రౌండ్ లెవల్ లో ఒక మినీ హాల్ అందుబాటులో ఉంటుంది. స్వచ్ఛమైన గాలి కోసం 78శాతం ఓపెన్‌ స్పేస్ ఉండడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఒక్కో బ్లాక్‌కు మధ్య 65 అడుగుల దూరం ఉండటంతో దారాళంగా గాలి, వెలుతురు అందుతుంది.

ఓఆర్‌ఆర్‌ జంక్షన్ నుంచి 2.ని, హైటెక్ సిటీ నుంచి 15.ని, ఎయిర్ పోర్ట్ నుంచి 25 ని. చేరుకోవచ్చు:
ఈ ప్రాజెక్టులో 1957 చదరపు అడుగులు.. 2,235 చదరపు అడుగుల విస్తీర్ణంతో మూడు బెడ్‌ రూమ్‌ల ఫ్లాట్లు అందుబాటులో ఉంటాయి. మూడు అంతస్తుల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. జాగింగ్ ట్రాక్‌, స్విమ్మింగ్‌ పూల్‌, ఔట్‌ డోర్ ప్లే కోర్టులు, పిల్లల కోసం ఆటస్థలం, 34 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ప్రత్యేకంగా క్లబ్‌ హౌస్‌.. ఇలా ఎన్నో ఆకర్షణీయమైన సదుపాయాలను తర్‌క్ష్యలో కల్పిస్తోంది మైహోమ్‌ గ్రూప్‌. అంతేకాదు.. తర్‌క్ష్య ప్రాజెక్టుకు ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ నుంచి 2 నిమిషాల్లో, హైటెక్ సిటీ నుంచి 15 నిమిషాల్లో, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. 

* మైహోం కొత్త వెంచర్‌
* మైహోం గ్రూప్‌ సరికొత్త ప్రాజెక్ట్‌ TARKSHYA
* కోకాపేటలో 4 స్కైహై బ్లాకుల నిర్మాణం
* సోమవారం ప్రాజెక్టుకు భూమి పూజ
* ప్రాజెక్టులో 78 శాతం ఓపెన్‌ స్పేస్‌ 

* ఒక్కో బ్లాక్‌లో జీ ప్లస్‌ 32 ఫ్లోర్స్‌
* 34 వేల చ.అడుగుల విస్తీర్ణంలో క్లబ్‌ హౌస్‌
* జాగింగ్‌ ట్రాక్‌, ప్లేకోర్ట్స్‌, స్విమ్మింగ్‌ పూల్‌, కిడ్స్‌ ప్లే ఏరియా
* ఓఆర్‌ఆర్‌ జంక్షన్ నుంచి 2 నిమిషాల్లో చేరుకోవచ్చు