బిగ్ బ్రేకింగ్ : 40 మంది స్కూల్‌ విద్యార్థుల‌ను క‌త్తితో పొడిచేసిన సెక్యూరిటీ గార్డ్

  • Published By: nagamani ,Published On : June 4, 2020 / 08:10 AM IST
బిగ్ బ్రేకింగ్ : 40 మంది స్కూల్‌ విద్యార్థుల‌ను క‌త్తితో పొడిచేసిన సెక్యూరిటీ గార్డ్

దక్షిణ చైనాలోని ఓ స్కూల్‌లో ఘోరాతి ఘోరం చోటుచేసుకుంది. 40 మంది విద్యార్థుల‌ను ఓ సెక్యూర్టీ గార్డు క‌త్తితో పొడిచాడు.  విద్యార్థుల‌తో పాటు టీచ‌ర్ల‌పై కూడా అత‌ను దాడి చేసిన‌ట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గాంగ్జీ ప్రావిన్సులోని సుజౌ నగరంలోని ఓ స్కూల్‌లో గురువారం (జూన్ 4,2020) ఉదయం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘటనపై  సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని చేపట్టారు.గాయపడినవారిని వివిధ హాస్పిటల్స్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. 

నిందితుడిని 50 ఏళ్ల సెక్యూర్టీ గార్డు  లి జియామిన్ గా గుర్తించారు. స్కూల్ ప్రిన్సిపాల్‌తో పాటు ఇత‌ర సెక్యూర్టీ గార్డులు కూడా ఈ దాడిలో గాయ‌ప‌డ్డారు. గాయపడివారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.  

ఈ దారుణంపై విద్యార్ధుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన వ్యక్తంచేస్తు్నారు. చదువుకోవటానికి పంపించిన పిల్లలు ఇలా కత్తిపోట్లకు గురవ్వటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో ఉన్న తమ పిల్లలను వేగంగా ఇళ్లకు తీసుకుపోతున్నారు. గాయపడిన విద్యార్దుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రాణాపాయం లేకుండా చూడు భగవంతుడా అంటూ ప్రార్థిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భాయందోళనలు నెలకొన్నాయి.  

కాగా..గ‌త కొన్నేళ్లుగా చైనాలో కత్తితో దాడి చేస్తున్న ఘ‌ట‌న‌లు పెరిగాయి. కింట‌ర్‌గార్డెన్‌, ప్రైమ‌రీ స్కూల్ విద్యార్థుల‌ను టార్గెట్ చేస్తూ దాడులు జ‌రుగుతున్నాయి.  ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ‌ద్ద కూడా దాడులు జ‌రుగుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మాన‌సికంగా స‌రిగా లేని వ్య‌క్తులు ఇలాంటి దాడుల‌కు దిగుతున్న‌ట్లు చైనా స‌ర్వేలు చెబుతున్నాయి.

Read: అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం..సారీ చెప్పిన అమెరికా రాయబారి