pakistan : పాకిస్థాన్‌ని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. 147 మంది మృతి

పాకిస్థాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుకుండా కురుస్తున్న భారీ వర్షాలకు 147 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతు అయ్యారు. వర్షాల కారణంగా అకస్మాత్తుగా వరదలు ముంచెత్తడంతో 147మంది ప్రాణాలు కోల్పోయారు.

pakistan : పాకిస్థాన్‌ని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. 147 మంది మృతి

Heavy Rains Lashed Pakistan 147 Dead

heavy rains In pakistan 147 dead : పాకిస్థాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుకుండా కురుస్తున్న భారీ వర్షాలకు 147 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతు అయ్యారు. వర్షాల కారణంగా అకస్మాత్తుగా వరదలు ముంచెత్తడంతో 147మంది ప్రాణాలు కోల్పోయారు.మరో 163మందికి పైగా గాయాపడ్డారని చనిపోయిన వారిలో 88 మంది మహిళలు, చిన్నారులు ఉన్నారని పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వెల్లడించింది.

భారీగా కురుస్తున్న వర్షాలకు వరదనీరు ఉదృతంగా ప్రవహిస్తుండంతో ఇళ్లు, రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. పవర్ స్టేషన్లు కూడా దెబ్బతినటంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశంలోని అతిపెద్ద దక్షిణ పోర్ట్ సిటీ కరాచీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చాలా వరకు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. దేశ వ్యాప్తంగా 1000కిపైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోడ్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయని, ఈ సమయంలో వాహనాల కంటే బోట్లే అవసరమని బాధితులు చెబుతున్నారు.

నీట మునిగిన కార్లను రోడ్లపైనే వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. బెలూచిస్థాన్ ప్రావిన్సులో ఇప్పటి వరకు 63 మంది వర్షాల కారణంగా మృతి చెందారు. సింధు ప్రావిన్స్ రాజధాని కరాచీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఇప్పటి వరకు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ఇస్లామాబాద్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. వాతావరణ మార్పులే భారీ వర్షాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.ఏడాదిలో ఈ సమయంలో కురిసిన సగటు వర్షాల కంటే దాదాపు రెట్టింపు వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.