Andhra Pradesh: చేతబడి నమ్మకం.. కన్నతల్లి, తమ్ముడు, చెల్లిని చంపిన కిరాతకుడు!

మూఢనమ్మకాలు, మూఢభక్తి జీవితాలను ఎంతగా నాశనం చేస్తాయో మన కళ్ళకు కట్టిన కథ మదనపల్లె అక్కాచెల్లెళ్ల జంట హత్యలు. ఉన్నత చదువులు చదివిన తల్లిదండ్రులే మూఢనమ్మకంతో కనిపెంచిన కూతుళ్ళను కడతేర్చారు. ఈ హత్యలు యావత్ దేశాన్ని ఆలోచనలో పడేశాయి.

Andhra Pradesh: చేతబడి నమ్మకం.. కన్నతల్లి, తమ్ముడు, చెల్లిని చంపిన కిరాతకుడు!

Andhra Pradesh

Andhra Pradesh: మూఢనమ్మకాలు, మూఢభక్తి జీవితాలను ఎంతగా నాశనం చేస్తాయో మన కళ్ళకు కట్టిన కథ మదనపల్లె అక్కాచెల్లెళ్ల జంట హత్యలు. ఉన్నత చదువులు చదివిన తల్లిదండ్రులే మూఢనమ్మకంతో కనిపెంచిన కూతుళ్ళను కడతేర్చారు. ఈ హత్యలు యావత్ దేశాన్ని ఆలోచనలో పడేశాయి. ఈ ఘటనతో హేతువాదులు, మానసిక నిపుణులు ఎంత చెప్పినా.. ఎంత వివరించినా ఈ తరహా ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ కిరాతకుడు చేతబడి నెపంతో కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లి, తమ్ముడిని కిరాతకంగా హత్య చేశాడు.

ప్రొద్దుటూరుకు చెందిన కరీముల్లా అనే వ్యక్తి ఆదివారం రాత్రి నిద్రిస్తున్న తన తల్లి గుల్జార్ బేగం, తమ్ముడు మహ్మద్ రఫీ, చెల్లెలు కరీమున్నీసాను రోకలిబండతో మోది హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చూస్తే రక్తమోడుతూ మూడు మృతదేహాలు కంటబడ్డాయి. సొంత కుటుంబాన్ని అతి కిరాతకంగా హత్యచేసిన ఈ ఘటనతో పొద్దుటూరులో కలకలం రేగింది. ఈ హత్యలు, నిందితుడు మానసిక స్థితిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

కిరాతకుడు కరీముల్లాకు కొంతకాలంగా ఇంట్లో భార్యతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సహకారం కోరగా వారు సహకరించకలేదు. తనకు సొంత తల్లే చేతబడి చేయించిందని కొంతకాలంగా కరీముల్లా ఆరోపిస్తున్నట్లుగా స్థానికులు చెప్తున్నారు. ఒకవైపు భార్యతో గొడవలు.. సొంత కుటుంబమే తనపై చేతబడి చేయించారనే కారణంగా కుటుంబాన్ని కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం ఆదివారం రాత్రి రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.