మేనల్లుడి కోసం రంగంలోకి ‘యాక్షన్ కింగ్’ అర్జున్
POGARU: ‘యాక్షన్ కింగ్’ అర్జున్ రెండో మేనల్లుడు, స్వర్గీయ చిరంజీవి సర్జా తమ్ముడు ‘యాక్షన్ ప్రిన్స్’ ధృవ సర్జా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ధృవ, రష్మిక మందన్న జంటగా నందకిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘పొగరు’.. తెలుగులో అదే పేరుతో విడుదల అవుతోంది.
‘కరాబు మైండు కరాబు.. మెరిసే కరాబు.. నిలబడి చూస్తావా రుబాబు..’ అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించి, సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది వ్యూస్, లైక్స్ రాబట్టిన ‘పొగరు’ లోని పాట బాగా పాపులర్ అయింది. ప్రోమోస్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ కారణంగా చాలా మంది తెలుగు రైట్స్ కోసం పోటీ పడగా రూ. 3 కోట్లకి పైగా ఫ్యాన్సీ రేటుతో వైజాగ్కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్సియర్, ప్రొడ్యూసర్ డి. ప్రతాప్ రాజు రైట్స్ సొంతం చేసుకున్నారు. ఆయన ఈ చిత్రాన్ని తెలుగులో సాయిసూర్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం చెన్నైలో జరిగింది. అర్జున్ మేనల్లుడిని పరిచయం చేస్తూ తనలానే ధృవ సర్జాను కూడా ఆదరించాలని అన్నారు. ఫిబ్రవరి 19న ‘పొగరు’ తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో మరో విశేషం ఏంటంటే.. డబ్ల్యూడబ్ల్యూలో ఫేమస్ ఫైటర్స్.. కాయ్ గ్రీనే, మోర్గన్ అస్తే, జో లిండర్, జాన్ లోకస్లు విలన్స్గా నటిండం విశేషం. ఈ నలుగురు బాడీ బిల్డర్స్కి, ధృవ సర్జాకి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెబుతున్నారు మూవీ టీం.
The wait is over, book your tickets today @DhruvaSarja is ready to unveil his Mass swag in #Pogaru at theatres near you tomorrow@iamRashmika #SaiSuryaEntertainments @FilmDirector_NK @chandanspshetty @ArjunJanyaMusic #JDoraBabu @aanandaaudio @IamEluruSreenu pic.twitter.com/y04AJmf5nr
— BARaju (@baraju_SuperHit) February 18, 2021