‘తల’ అజిత్ సైక్లింగ్ ట్రిప్..
Ajith Cycling Trip: కోలీవుడ్ స్టార్ హీరో ‘తల’ అజిత్ కుమార్ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల అజిత్ హైదరాబాద్లో కెమెరా కంట పడ్డారు. క్లీన్ షేవ్తో సరికొత్తగా ఉన్న తల పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.
‘నెర్కొండ పార్వై’ తర్వాత దర్శకుడు హెచ్. వినోద్, నిర్మాత బోనీ కపూర్, అజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘వలిమై’.. ఈ మూవీ షూటింగ్ ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో జరుగింది.
తాజాగా అజిత్ సైక్లింగ్ ట్రిప్కి సంబంధించిన పిక్స్ బయటకి వచ్చాయి.. చెన్నై నుండి కోల్కత్తా మీదుగా సాగిన ఈ ట్రిప్లో మార్గమధ్యలో అజిత్ కెమెరాకి ఫొజులిచ్చారు. ‘వలిమై’ త్వరలో విడుదల కానుంది.