‘ఆహా’ మెగా డబుల్ ధమాకా..

‘ఆహా’ మెగా డబుల్ ధమాకా..

Mega Dhamaka: ఫస్ట్ అండ్ పాపులర్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ సమంతతో ఇటీవల ‘సామ్ జామ్’ పేరిట ఓ స్పెషల్ టాక్ షోను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలో సామ్ తనదైన స్టైల్లో పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ.. ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ, రానా, నాగ్ అశ్విన్, తమన్నా, క్రిష్, రకుల్ ప్రీత్ ఈ షో లో పార్టిసిపేట్ చేశారు..

ఇప్పుడు ‘ఆహా’ తమ ప్రేక్షకుల కోసం మెగా డబుల్ ధమాకా తీసుకొచ్చింది. క్రిస్మస్ కానుకగా మెగాస్టార్ చిరంజీవి ఎపిసోడ్ ప్రీమియర్ కానుంది. ఇటీవల విడుదల చేసిన ప్రోమోకి మంచి స్పందన వస్తోంది.

అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్న స్పెషల్ ఎపిసోడ్‌ న్యూ ఇయర్ సందర్భంగా 2021 జనవరి 1న స్ట్రీమింగ్ కానుంది. ‘ఆహా’ అందిస్తున్న మెగా డబుల్ ధమాకా కోసం మెగా అండ్ అల్లు ఎక్స్‌క్లూజివ్ ఎపిసోడ్స్ కోసం ఫ్యాన్స్, ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.