చెర్రీ.. పెట్టిన ఆ పోస్టుకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్..!
మెగాపవర్ స్టార్ రామ్చరణ్ పెట్టిన పోస్టు చూసిన ఫ్యాన్స్ ఫిధా అయిపోతున్నారు. ఇప్పుడు అదే పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చెర్రి పెట్టిన క్యాప్షన్కు నెటిజన్లు కూడా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు హరిద్వార్లో దిగిన ఫొటోలను చెర్రీ తన ట్విటర్లో అకౌంట్లో షేర్ చేశాడు.
అంతే.. క్షణాల్లో ఆ పోస్టును వైరల్ చేసేశారు. ‘ చాలా ఏళ్ల క్రితం.. హరిద్వార్లో ఈ ఫొటో తీసుకున్నా.. కరోనా పరిస్థితులు మారి మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు పరిస్థితులకు తగ్గట్టు మసలుకోవడమే ఎంతో ఉత్తమం. సురక్షితంగా ఉండండి’ అంటూ చెర్రీ కామెంట్ పెట్టాడు.
మరోవైపు.. సినిమా షూటింగ్లకు రెండు ఏపీ రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతినిచ్చింది. త్వరలోనే ‘రౌద్రం రణం రుధిరం’ (RRR) మూవీతో రామ్చరణ్ మళ్లీ బిజీ కానున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్గా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
Throwback – In Haridwar.
Right now going with the flow and hoping that things get back to normal. Stay safe. pic.twitter.com/dDVJFpeNgq
— Ram Charan (@AlwaysRamCharan) June 11, 2020