IPL 2024 : సంజూ పోరాటం వృథా.. ఉత్కంఠపోరులో ఢిల్లీదే గెలుపు

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

IPL 2024 : సంజూ పోరాటం వృథా.. ఉత్కంఠపోరులో ఢిల్లీదే గెలుపు

Dc Vs RR (Photo Credit : Google)

IPL 2024 : రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విక్టరీ కొట్టింది. 20 పరుగుల తేడాతో రాజస్తాన్ ఓటమి చవి చూసింది. 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. సంజూ 46 బంతుల్లోనే 86 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. సంజూ పోరాడినా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో.. జట్టుకి పరాజయం తప్పలేదు.

ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ 65, జేక్ ఫ్రేజర్ 50, స్టబ్స్ 41 పరుగులతో చెలరేగారు. రాజస్తాన్ బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు తీశాడు.

Also Read : ఐపీఎల్‌లో గోల్డెన్ డ‌క్ అంటే ఏమిటి? ఎన్ని ర‌కాల డ‌కౌట్లు ఉన్నాయో తెలుసా..?