దక్షిణాదిపై పట్టు సాధించేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు.. ఏమి చేస్తోందో తెలుసా?

Narendra Modi: ఈ లోక్‌సభ ఎన్నికల్లో సౌత్‌లో తమ ఓట్లు, సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు బీజేపీ లీడర్లు. 

దక్షిణాదిపై పట్టు సాధించేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు.. ఏమి చేస్తోందో తెలుసా?

PM modi

సొంతంగా 370 సీట్లు సాధించాలని టార్గెట్‌గా పెట్టుకున్న కమలనాథులు..ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. 130కి పైగా ఎంపీ సీట్లున్న దక్షిణాదిలో అనుకున్న ఫలితాలు సాధిస్తేనే టార్గెట్ రీచ్ అవుతామని భావిస్తున్నారు. అందుకోసం సౌత్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు బీజేపీ అగ్రనేతలు. ప్రధానిమోదీతో సహా కమలం పార్టీ ప్రముఖ లీడర్లంతా తెలంగాణలో వరుస పెట్టి పర్యటిస్తున్నారు.

ప్రధాని మోదీ పదే పదే దక్షిణాదిలోని 5 రాష్ట్రాల్లో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుస పెట్టి..సౌత్‌లో సభలకు అటెండ్ అవుతున్నారు మోదీ. ఈసారి మోదీ తమిళనాడు పదుల సంఖ్యలో మీటింగ్‌లకు హాజరయ్యారు.

ఓటు షేర్ పెంచుకోవడమే లక్ష్యం
ఈసారి తమిళనాడులో మెజార్టీ ఎంపీ సీట్లు దక్కించుకోవడం లేకపోతే.. ఓటు షేర్ పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేసింది బీజేపీ. 2014 మే 26 నుంచి 2024 ఏప్రిల్‌ 17వరకు తెలంగాణ, ఏపీ, కర్నాటక, కేరళ, తమిళనాడులలో మోదీ 146 సార్లు పర్యటించారు. తన రెండు విడతల పదవీకాలంలో 73 సార్ల చొప్పున ఈ 5 రాష్ట్రాల్లో తిరిగారు. ప్రధాని కార్యాలయంలోని రికార్డుల ప్రకారం.. గత మూడేళ్లలోనే దక్షిణాది రాష్ట్రాల్లో 59 పర్యటనలు జరిపారు.

మొదటి విడత పదవీ కాలంలో దేశవ్యాప్త పర్యటనల్లో 14శాతంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల పర్యటన రెండో విడత పదవీకాలంలో 18శాతానికి పెరిగింది. 2022లో 13 సార్లు, 2023లో 23 సార్లు, 2024లో ఇప్పటివరకు 25సార్లకు పైగా దక్షిణాదిలో పర్యటించారు మోదీ. ఈ పర్యటనలన్నీ భవిష్యత్‌లో పార్టీ పటిష్టకోసమే అంటున్నారు కమలనాథులు. నార్తే కాదు సౌత్‌లోనూ బీజేపీకి పట్టుందని త్వరలోనే నిరూపిస్తామంటున్నారు.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో సౌత్‌లో తమ ఓట్లు, సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు బీజేపీ లీడర్లు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. గత ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి 0.97%, కేరళలో 12%, తమిళనాడులో 3.6శాతం ఓట్లు వచ్చాయి.

సర్వశక్తులు ఒడ్డుతూ..
కర్నాటకలో గత ఎన్నికల్లో 25 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. ఈసారి ఆ సీట్లను నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. 2019లో తెలంగాణలో 4 సీట్లు గెలుచుకున్న బీజేపీ..ఈసారి పదికి తక్కువ కాకుండా సీట్లు సాధించాలని కసిగా ఉంది. ఏపీలో కూటమిగా ఎన్నికల్లోకి వెళ్తున్న బీజేపీ.. ఆరు సీట్లలో పోటీ చేస్తుంది.

నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఏపీలో రెండుసార్లు పర్యటించారు ప్రధాని. దక్షిణాదిలో ప్రధాని మోదీ ఇప్పటివరకు 146 సార్లు పర్యటించారు. అందులో 64 అధికారిక కార్యక్రమాలు కాగా, 56 పార్టీ తరఫున సాగాయి. అంటే సౌత్‌లో పార్టీని డెవలప్ చేసేందుకు మోదీ ఎంతగా ఎఫర్ట్ పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

Also Read: ఖమ్మంలో సినీ హీరో విక్టరీ వెంకటేశ్ రోడ్ షో.. ఎన్నికల ప్రచారం