కేరళలో ఏబీవీపీ విద్యార్ధుల ఆందోళనలో ఉద్రిక్తత..భాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు

కేరళలో ఏబీవీపీ విద్యార్ధుల ఆందోళనలో ఉద్రిక్తత..భాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు

Tension in Kerala ABVP students’ Dharna : కేరళలో ఏబీవీపీ విద్యార్ధులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులతో ఏబీవీపీ విద్యార్ధులు బాహాబాహీకి దిగటం పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో పోలీసులు విద్యార్ధులపై బాష్పవాయువు ప్రయోగించారు. పీఎస్సీ ర్యాంకు హోల్డర్లకు మద్దతుగా సెక్రటేరియట్ ముందు ఏబీవీపీ విద్యార్ధులు ఆందోళనకు దిగారు.

పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై విద్యార్ధులు ఒక్కసారిగా బాహాబాహీకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావటానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. పీఎస్సీ ర్యాంకర్లకు సంబంధించి ఆందోళకారులతో చర్చలకు సిద్ధమని చెప్పినా ఏబీవీపీ విద్యార్ధులు ఆందోళన కొనసాగించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన కారులను చెదరగొట్టారు. పరిస్థితి చేయి దాటిపోతున్న క్రమంలో పోలీసులు విద్యార్ధులను అదుపు చేయటానికి తప్పనిసరి పరిస్థితుల్లో బాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చింది.

ఈ క్రమంలో కొంతమంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు.వారిని వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. పీఎస్సీ ర్యాంకర్లకు సంబంధించి ఆందోళకారులతో చర్చలకు సిద్ధమని ప్రభుత్వం ఆందోళన కారులకు స్పష్టంచేసింది.