Trolling on Heroins : హీరోయిన్స్ పై పెరిగిపోతున్న ట్రోలింగ్.. సౌత్ టు నార్త్ అందరిదీ ఇదే బాధ..

సోషల్ మీడియాను నిత్యం వేడెక్కించే అంశం ట్రోలింగ్. ప్రముఖ హీరోయిన్స్ డ్రెసింగ్, బాడీ షేమింగ్, పాత్రల ఎంపిక, ఫోటోషూట్స్ పై దుమ్మెత్తిపోస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ కొంతమంది నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఇది మరీ...........

Trolling on Heroins : హీరోయిన్స్ పై పెరిగిపోతున్న ట్రోలింగ్.. సౌత్ టు నార్త్ అందరిదీ ఇదే బాధ..

Trolling on Heroins increasing day by day

Trolling on Heroins :  సోషల్ మీడియాను నిత్యం వేడెక్కించే అంశం ట్రోలింగ్. ప్రముఖ హీరోయిన్స్ డ్రెసింగ్, బాడీ షేమింగ్, పాత్రల ఎంపిక, ఫోటోషూట్స్ పై దుమ్మెత్తిపోస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ కొంతమంది నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఇది మరీ ఎక్కువైంది. ఇప్పటి వరకూ ఎందరో హీరోయిన్స్ వీటి బారిన పడిన పడ్డారు. ఇటీవల ఆ లిస్ట్ మరింత పెరుగుతుంది.

ట్రోలింగ్ కల్చర్ అంతకంతకు విస్తరిస్తోందే కానీ తగ్గడం లేదు. ముఖ్యంగా కథానాయికలపై హేట్ మెసేజ్ లు, దూషణలు ఆగకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. స్టార్ స్టేటస్ తెచ్చుకున్న ఎందరో హీరోయిన్స్ నిత్యం ట్రోలింగ్ బారిన పడుతునే ఉన్నారు. సినిమాల నుంచి పర్సనల్ విషయాల వరకూ పాయింట్ అవుట్ చేస్తూ ఎందరినో ఆవేదనకు గురి చేస్తున్నారు ట్రోలర్స్. ఎంతగా చర్యలు తీసుకుంటున్నా వీటికి అడ్డు కట్ట వేయలేకపోతున్నారు.

ఇటీవలే నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ట్రోలింగ్ బారిన పడడంతో ట్రోలర్లపై ఒక లాంగ్ నోట్ రాసింది. ఓ వైపు టాలీవుడ్ లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ ఆరంగేట్రం చేసిన రష్మిక నేషనల్ క్రష్ గా బోలెడంత పాపులరైంది. కానీ ఇటీవల ‘గుడ్ బై’ మూవీతో ఫ్లాప్ ని ఎదుర్కొంది. దాంతో తనపై ట్రోలింగ్ అమాంతం పెరిగింది. దీంతో కలత చెందిన రష్మిక సోషల్ మీడియా తో తనను ట్రోల్ చేస్తున్న వారిని ఉద్ధేశించి ఒక సుదీర్ఘ నోట్ రాసింది. ఇంటర్నెట్ లో ద్వేషాన్ని ఎదుర్కోవడం ‘హృదయ విదారకం’. ఇది తీవ్రంగా నిరుత్సాహపరుస్తుందని కోట్ చేసింది రష్మిక. ఇంటర్నెట్ లో తప్పుడు కథనాలు వ్యాప్తి చెందుతున్నాయని, ఇది తనకు పరిశ్రమలో అలాగే పరిశ్రమేతర సంబంధాలకు చాలా హానికరం అని ఎత్తి చూపింది.

స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ తనని సామాజిక మాధ్యమాల్లో ద్వేషించేవారిని ఉద్ధేశించి మాట్లాడుతూ ఇలాంటి విష సంస్కృతి అంత మంచిది కాదని మండిపడింది. తనను కొందరు ‘మంత్రగత్తె’ అని కూడా ట్రోల్ చేశారని కానీ నేను వేటినీ పట్టించుకునే స్థితిలో లేనని కూడా శ్రుతిహాసన్ రియాక్టయింది.

నిత్యం ఏదో ఒక విషయంలో ట్రోలర్స్ బారిన పడే మరో బ్యూటీ అనసూయ. బుల్లి తెర స్టార్ యాంకర్ గా, వెండితెర బెస్ట్ పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న అనసూయను సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వారి సంఖ్య కాస్త ఎక్కువనే చెప్పాలి. ఆమె డ్రెసింగ్ సెన్స్ పై, ఎక్స్పోజింగ్ పై , బాడీ షేమింగ్ పై ఎవరో ఒకరు ట్రోల్స్ సంధిస్తూనే ఉంటారు. అయితే వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం అలవాటు చేసుకుంది అనసూయ. రీసెంట్ గా సోషల్ మీడియాలో అనసూయను ‘ఆంటీ’ అంటూ టార్గెట్ చేస్తూ కొందరు నెటిజన్లు ఆమెపై కామెంట్స్ చేస్తూ రచ్చ చేశారు. దీనిపై ఘాటుగా స్పందించిన అనసూయ మరోసారి ఆంటీ అంటే తప్పకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది.

ఇక ఈ ట్రోలింగ్ కల్చర్ సౌత్ లో కన్నా నార్త్ లో కాస్తంత ఎక్కువే. బాలీవుడ్ క్రేజీ బ్యూటీస్ ఎందరో నిత్యం ఏదో ఒక ట్రోల్ కు గురవుతునే ఉన్నారు. కొంతమంది మరీ దిగజారి వల్గర్ మెసేజులతో ఆ బ్యూటీస్ ను టార్టెట్ చేస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణేకు కూడా ఈ రకమైన ట్రోలింగ్ ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమెని టార్గెట్ చేస్తూ అసభ్యకర కామెంట్స్ చేయడం బాగా ఎక్కువైంది. బూతులు తిడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు. అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా నేరుగా దీపికాకే మెసేజ్ లు పెడుతున్నారు. తనపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తోన్న ట్రోలర్స్ పై దీపికా ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు అసభ్యకర రీతిలో మెసేజ్ లు పెట్టిన వారి స్క్రీన్ షాట్ ని తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేస్తూ ”వావ్.. ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ కుటుంబం, స్నేహితులు గర్విస్తారు” అంటూ చురకలు అంటిస్తూ పోస్ట్ పెట్టింది.

NC 22 : నాగ చైతన్య ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా.. కంగారు పడుతున్న ఫ్యాన్స్..

బాలీవుడ్ బ్యూటీ వాణికపూర్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం తన హాట్ ఫోటోస్ తో ఇన్‌స్టాను వేడెక్కిస్తూ ఉంటుంది. రీసెంట్ గా వాణీ కపూర్ ​తన శరీరం విషయంలో విమర్శలు ఎదుర్కొంది. ఆమె అస్తిపంజరంలా ఉందని, ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేశారు. పోషకాహార లోపం ఉందా? అని ఎగతాళి చేశారు. వీటిపై ఆమె విభిన్నంగా స్పందించారు. నలుగురి దృష్టిలో పడటానికి ఇలా మాట్లాడతారని, కానీ ప్రయోజనం లేదని రిప్లై ఇచ్చింది.

బాలీవుడ్ లో తరచుగా ట్రోలింగ్స్ ఎదుర్కొనే మరో హీరోయిన్ తాప్సీ పన్ను. ఆమె కొత్త సినిమా రిలీజ్ అవుతున్నప్పుడల్లా ఎవరో ఒక నెటిజెన్ తాప్సీని టార్గెట్ చేస్తూ ఏదో ఒక ట్రోల్ వదలుతునే ఉంటాడు. ఆమె ఎర్లియర్ మూవీ రష్మీ రాకెట్ రిలీజ్ సందర్బంగా.. ఓ నెటిజెన్ తాప్సీని దారుణంగా ట్రోల్ చేశాడు. ‘నీకు నటన రాదు. మంచి కథలు ఎంచుకుంటూనే వాటిని నాశనం చేస్తున్నావ్. ఫాల్తు హీరోయిన్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనిపై ఘాటుగా స్పందించిన తాప్సీ.. ‘నేను సరికొత్త ప్రమాణాలను సృష్టించాను. ఆ విషయం నీకు అర్థం కావడం లేదు’ అంటూ రిప్లయ్ ఇచ్చింది.

Pushpa Movie : పుష్ప మొదలుపెట్టి రెండేళ్లు.. రిలీజయి వన్ ఇయర్.. అభిమానులకి స్పెషల్ ట్రీట్ ఇస్తారా??

ఇలా సౌత్ టు నార్త్ తేడా లేకుండా చాలా మంది హీరోయిన్స్ ట్రోలింగ్ బారిన పడుతున్నారు. కొంతమంది ధైర్యంగా రిప్లై లు, కౌంటర్లు ఇస్తున్నారు. కొంతమంది వాటిని చూసి చూడనట్టు వదిలేస్తుంటే, మరికొంతమంది భామలు మాత్రం సైబర్ పోలీసులకి ఫిర్యాదులు చేస్తున్నారు.