‘పటాస్’ చెత్త సినిమా అన్నారు-ఆ ఛానెల్ వాళ్లు మళ్లీ కనిపించలేదు..

‘నీకు మాత్రమే చెప్తా’ షో లో ‘పటాస్’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి..

  • Published By: sekhar ,Published On : March 16, 2020 / 01:01 PM IST
‘పటాస్’ చెత్త సినిమా అన్నారు-ఆ ఛానెల్ వాళ్లు మళ్లీ కనిపించలేదు..

‘నీకు మాత్రమే చెప్తా’ షో లో ‘పటాస్’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి..

తాను దర్శకుడిగా తెరకెక్కించిన మొదటి చిత్రం ‘పటాస్’ సినిమా ‘చెత్త సినిమా’ అని తేల్చేయండంతో షాక్ అయ్యానని అనిల్ రావిపూడి చెప్పాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ హోస్ట్‌గా ‘ఈటీవీ ప్లస్‌లో ప్రసారమవుతున్న ‘నీకు మాత్రమే చెప్తా’ షో కి గెస్ట్‌గా విచ్చేసి తన సినిమా కెరీర్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా డైరెక్టర్‌గా డెబ్యూ మూవీ ‘పటాస్’ విషయంలో వచ్చిన కామెంట్స్ విని ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి గురించి వివరించాడు.

అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ, యన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్.. ‘పటాస్’.. ఈ సినిమా పూర్తయ్యాక ఒక శాటిలైట్ ఛానెల్ వాళ్లు ఎడిటింగ్ రూమ్‌లో కూర్చుని సినిమా చూశారట.. సినిమా చూస్తున్నంత సేపూ వాళ్లు బాతాకానీ కొడుతూనే ఉన్నారట.

సినిమా అయిపోయాక బయటకొచ్చి.. కళ్యాణ్ రామ్‌తో ‘ఇదో చెత్త సినిమా.. ఎలా తీశారు.. ఏం సినిమా అసలు.. ఎలివేషన్స్ ఏవి.. హీరోయిజం ఏది?’.. అనగానే కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి షాక్ అయ్యారట. సినిమా తీశాం కానీ.. మరీ అంత చెత్తగా తీశామా అనే సందేహం కూడా వచ్చిందట.. తర్వాతి రోజు దిల్ రాజు, శిరీష్ సినిమా చూడకపోతే, ఛానెల్ వాళ్ల మాటలు విని సినిమాను చెడగొట్టేసే వాళ్లం.. సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. తర్వాత ఆ ఛానెల్ వాళ్లు ఇంకెక్కడా కనిపించలేదు’ అని అనిల్ రావిపూడి తెలిపాడు.