సంగీతారాధ్యులు శ్రీపతి పండితారాధ్యుల వారు.. ఎస్పీ బాలు జీవిత విశేషాలు..

SPB Life History: * 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో జన్మించిన బాలసుబ్రహ్మణ్యం
* సాంబమూర్తి, శకుంతల తల్లిదండ్రులు
* నెల్లూరు, నగరి, శ్రీకాళహస్తి, తిరుపతి, అనంతపుపరం, చెన్నైలో విద్యాభ్యాసం
* ఆయన భార్య పేరు సావిత్రి
* ఆయన కుమార్తె పల్లవి, కొడుకు చరణ్
* 1967లో శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రంతో గాయకుడిగా పరిచయం
* శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న చిత్రంలో ఎస్పీ కోదండపాణి సంగీత దర్శకత్వంలో పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, ఈలపాట రఘురామయ్యతో కలిసి తొలిపాట పాడారు. `ఏమి ఈ వింత మోహము` అనేది తొలిపాట.
* 1966 డిసెంబర్ 15న ఈ పాటను రికార్డింగ్ చేశారు.
* `నక్కరే అదే స్వర్గ` చిత్రంలో పి.సుశీలతో `కనసిదో ననసిదో` తొలి కన్నడ పాట
* ఆయన పాట పాడిన `హోటల్ రంభ` అనే తమిళ సినిమా విడుదల కాలేదు.
* `శాంతి నిలయం` చిత్రంలో పి.సుశీలతో ఆయన పాడిన తొలి తమిళపాట విడుదలైంది.
* ఘంటసాలతో కలిసి ఏకవీర, మంచి మిత్రులు, దేవుడు చేసిన మనుషులు, అలీబాబా 40 దొంగలు, నీతి – నిజాయతీ చిత్రంలో పాడారు.
* మలయాళంలో `కడల్ పాలమ్` అనే చిత్రంతో సోలో సాంగ్తో పరిచయమయ్యారు.
* హిందీలో 1981లో ఏక్ దుజే కేలియే చిత్రంలో తేరే మేరే బీచ్ మే ఆయన పాడిన తొలి పాట.
* సంగీత దర్శకుడిగా ఆయన తొలి చిత్రం ‘కన్యాకుమారి’ 1977.
* తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.
* దాదాపు 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు బాలు
* కమల్ హాసన్, భాగ్యరాజా, కుల్భూషన్ కర్బందా, పరేష్ రావెల్, విసు, టి.రాజేందర్, సుమన్, జగపతిబాబు, నరేష్, మోహన్లాల్, జెమినీ గణేష్, నాగార్జున (తమిళం), రఘువరన్ కు డబ్బింగ్ చెప్పారు.
* మహమ్మద్ రఫీ, జానకి, ఏసుదాస్, సోనూ నిగమ్ అంటే ఆయనకు చాలా ఇష్టం.
* మాయాబజార్ సినిమా తనకు ఫేవరేట్ అని చెప్పేవారు
* యమన్ రాగాన్ని అమితంగా ఇష్టపడేవారు
* క్రికెట్, టెన్నిస్ చూడడం ఇష్టం
* తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేవారు
* తొలిసారి 1972లో మహ్మద్ బీన్ తుగ్లక్ చిత్రంలో `హ్యాపీ బర్త్ డే టూ యూ` అంటూ పాడుతూ కనిపించారు.
*1991లో బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావుతో తెలుగు చలనచిత్ర చరిత్రలో గుర్తుండిపోయే ‘ఆదిత్య 369’ చిత్రాన్ని నిర్మించారు.
* మలయాళ యోధ చిత్రాన్ని అనువదించి నిర్మాతగా మారారు. ఎస్.ఎల్.ఆర్. క్రియేషన్స్ పతాకంపై పిల్లలు పల్లవి – చరణ్ పేరుతో అనువాదం చేశారు.
* 1994లో ఎస్.ఎల్.ఆర్.క్రియేషన్స్ పతాకంపై తమిళంలో `హలో బ్రదర్`ని అనువదించారు. నాగార్జున రెండు పాత్రలకూ తమిళంలో బాలూనే డబ్బింగ్ చెప్పారు.
* 1996లో `భామనే సత్యభామనే` చిత్రాన్ని నిర్మించారు.
* 2000లో `తెనాలి`, `2005లో `శుభసంకల్పం` నిర్మించారు.
అవార్డులు
* 1999లో తెలుగు యూనివర్శిటీ డాక్టరేట్ అందుకున్నారు.
* 2001లో పద్మశ్రీ
* 2011 పద్మభూషణ్
* గాయకుడిగా మొదటి చిత్రం మర్యాద రామన్న… చివరి చిత్రం..రవితేజ డిస్కో రాజా
* 11 భాషల్లో దాదాపు 40 వేలకు పైగా పాటలు పాడారు.
* అన్ని భాషల్నీ అమ్మ భాషలుగా చేసుకుని, ఆయా భాషల్లోని మాటల భావాత్మని తన గొంతులో పలికించి, ఆ భాషల శ్రోతలకు స్వరసామ్రాజ్య చక్రవర్తిగా ఎదిగిన బాలు తెలుగువాడు కావడం తెలుగువాళ్లు గర్వకారణమని చెప్పాలి.
* బాలు నట గాయకుడు. ఏ నటుడి కోసం పాడుతున్నాడో ఆ నటుడి హావ భావాల్ని, నటనా ధోరణిని సంపూర్ణంగా అవగాహన చేసుకుని, తదనుగుణంగా గాత్రాన్ని మలిచి పాటకు ప్రాణం పోయడం బాలుకు గొంతుతో పెట్టిన విద్య.
* తొలినాళ్ళలో చేయూత నిచ్చిన గురువు పట్ల అభిమానంతో తన సౌండ్ స్టూడియో కి కోదండపాణి పేరును పెట్టడం, తాను దైవంగా భావించే
ఘంటసాల విగ్రహాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయడం, జానకమ్మ ప్రోత్సాహంతో సినీ రంగ ప్రవేశం చేసాననే కృతజ్ఞతాభావంతో బాలు
పుట్టినరోజునాడు ఎస్.జానకికి జాతీయ పురస్కారాన్ని అందించడం ఇవన్నీ బాలు సంస్కారానికి, మహోన్నత వ్యక్తిత్వానికి, నిలువెత్తు
నిదర్శనాలు.
* పాటలోనే మాటలని, గళంలో అభినయ ముద్రలని నింపి తెలుగుదనం ఒలికించగల విలక్షణత అతను ప్రత్యేకత.
* గళం విప్పినా… స్వరం కూర్చినా… ఆ పాటలోని కవి భావాన్ని సూటిగా ప్రేక్షకులవద్దకు తీసుకువెళ్ళగలిగే సత్తా అతని గళానికి ఉంది.
* తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు.
* అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలైన వారసుడిగా నిలిచారు.
* పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతను పాటను పండిత పామరులకి చేరువ చేసింది.
* శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి.
* 40 ఏళ్ళ సినీప్రస్థానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదైన రికార్డు సృష్టించారు.
* తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి.
* గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి బాల సుబ్రమణ్యం.
* 2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో బాలుకు శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని (సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్2016) ప్రదానం చేశారు.
* బాలు గొంతులో భక్తి తొణికిసలాడుతుంది. విరహము ఉంటుంది. విషాద పాటలైనా, ప్రేమ గీతాలైనా, మాస్ బీట్స్ అయినా..సందేశాత్మకాలైనా.. ప్రతీది ఆయన నోట అలవోకగా జాలువారుతాయి. పాటలోని మాటలను …గొంతులో అభినయ ముద్రలుగా నిలిపి తెలుగుదనం ఒలికించిన విలక్షణ గాయకుడు బాలసుబ్రమణ్యం. ఆయన గొంతుకు తరాల అంతరాలు తెలియదు.
* ఎంతమంది కథానాయకులకైనా తన అద్భుతమైన స్వరంతో వారికి అనుగుణంగా పాటలు పాడగల గొప్పగాయకుడు ఎస్పీ బాలు.
* తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకానొక ఆణిముత్యం బాల సుబ్రహ్మణ్యం.
* బాలు సినీ జీవితం ‘శంకరాభరణం’ సినిమాతో పూర్తిగా మారిపోయింది.
* అప్పటివరకు మాస్ గీతాలకే పరిమితం అయిన బాలు.. ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలనని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు.
* ఈ చిత్రానికి బాలు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నాడు.
* తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి.. ప్రాణం పోశారు.
* ఒక పాట విన్న తర్వాత ఆ పాట ఏ హీరోదో చెప్పడం అది బాలూ పాడితేనే సాధ్యం.
* తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటాడు బాలూ.
* హిందీలో తొలిసారి పాడిన ‘ఏక్ దూజేలియే’ చిత్రంలో.. అద్భుతంగా పాడి అక్కడి వారిచేత శభాష్ అనిపించుకున్నాడు.
* ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం.
* తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రహ్మణ్యానికే చెల్లింది.
* భక్తి గీతాలను సైతం ఎంతో రసరమ్యంగా పాడ్డంలో బాలూ శైలే వేరు.
ముఖ్యంగా అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం చిత్రాలలో ఎస్పీ ఆలపించిన భక్తి గీతాలు ఇప్పటకి ప్రతి ఇంటా వినిపిస్తూనే ఉన్నాయి.
* గాయకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడిగా, నటుడిగా, టి.వి వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా.. ఇలా బహుముఖ ప్రఙ్ఞను ప్రదర్శించాడు బాలు.
* నిర్మాతగా ఆదిత్య369, శుభసంకల్పం, భామనే సత్యభామనే, వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించి తన అభిరుచి చాటుకున్నాడు.
* ఓ పాపా లాలి చిత్రంలో ‘మాటేరాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు’ అంటూ…బాలూ నటించి, ఆలపించిన బ్రీత్ లెస్ గీతం సంగీతాభిమానులు ఎప్పటికి మరిచిపోలేరు.
* ఆయన అందుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలకు లెక్కే లేదు.
* బాలు నోటి నుంచి వచ్చే ప్రతి పాట పంచామృతమే. గాయకుడిగా ఆయన స్వరరాగ ప్రవాహం ఎప్పటికీ కొనసాగుతూనే వుంటుంది.