Veera Simha Reddy : ‘సుగుణ సుందరి’ వచ్చేసింది.. బాలయ్య స్టెప్పులు అదరగొట్టేసాడుగా..

బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న మాస్ మసాలా యాక్షన్ మూవీ 'వీరసింహారెడ్డి'. ఇప్పటికే ఈ మూవీలోని మొదటి పాటని విడుదల చేయగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా నేడు ఈ సినిమాలోని డ్యూయెట్ సాంగ్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్.

Veera Simha Reddy : ‘సుగుణ సుందరి’ వచ్చేసింది.. బాలయ్య స్టెప్పులు అదరగొట్టేసాడుగా..

Veera Simha Reddy Suguna Sundari Lyrical Video out now

Veera Simha Reddy : బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న మాస్ మసాలా యాక్షన్ మూవీ ‘వీరసింహారెడ్డి’. ఫ్యాక్షన్ డ్రామా వస్తున్న ఈ చిత్రంపై అభిమానులలో అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి. దాదాపు షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలు పెట్టేసింది. గోపీచంద మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Veerasimha Reddy: వీరసింహారెడ్డి నుండి ఈసారి వచ్చే అప్డేట్ ఏమిటో తెలుసా..?

ఇక విడుదల దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ మూవీలోని మొదటి పాటని విడుదల చేయగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా నేడు ఈ సినిమాలోని డ్యూయెట్ సాంగ్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్. ‘సుగుణ సుందరి’ అంటూ సాగే ఈ సాంగ్ లిరికల్ వీడియోని గురువారం ఉదయం 9.42 గంటలకు రిలీజ్ చేశారు. ఈ పాటకి శృతిహాసన్ తో పాటు బాలయ్య వేసిన స్టెప్పులు అదరగొట్టేసిని.

ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. రామ్ మిరియాల, స్నిగ్ధ శర్మ ఆలపించారు. శేఖర్ మాస్టర్ డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. కాగా ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చాలా కాలం తరువాత ఫ్యాక్షన్ డ్రామాతో వస్తున్న బాలయ్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.