Delhi : కుక్కతో కలిసి వాకింగ్ చేసినందుకు ఉద్యోగం పోగొట్టుకున్న మహిళా ఐఏఎస్
తన పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ చేసినందుకు ఓ మహిళా ఐఏఎస్ అధికారి తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సివస్తుంది. క్రీడామైదానంలో తన పెంపుడు కుక్కతో వారింగ్ చేసిన ఐఏఎస్ అధికారణి రింకు దుగ్గాతో ప్రభుత్వం బలవంతంగా రాజీనామా చేయించింది.

IAS officer Rinku Dugga
IAS officer Rinku Dugga : తన పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ చేసినందుకు ఓ మహిళా ఐఏఎస్ అధికారి తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సివస్తుంది. క్రీడామైదానంలో తన పెంపుడు కుక్కతో వారింగ్ చేసిన ఐఏఎస్ అధికారణి రింకు దుగ్గాతో ప్రభుత్వం బలవంతంగా రాజీనామా చేయించింది. ప్రభుత్వ అధికారులు ప్రాథమిక నిబంధనలు, సెంట్రల్ సివిల్స్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా పదవీ విరమణ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది.
కాగా రింకూ దగ్గా బలవంతపు రాజీనామాకు కారణమైన ఈ ఘటన గత ఏడాది ఢిల్లీలో జరిగింది. 2022లో రింకూ దుగ్గా తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంకు వెళ్లారు. ఆ సమయంలో అథ్లెట్లు వ్యాయామం చేసుకుంటుండగా వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఇది అప్పట్లో వివాదమైంది. ఐఏఎస్ కోసం తమను మైదానం నుంచి వెళ్లిపోమనటంపై క్రీడాకారులు అసహనం వ్యక్తంచేశారు. రింకు దగ్గా తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించటానికి ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియం నుంచి క్రీడాకారులను ముందుగానే పంపించివేయడం వివాదాస్పదంగా మారింది.
Food in News papers : న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన ఆహారం తింటున్నారా..? ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరిక
ఈ స్టేడియం క్రీడాకారుల కోసం ఉదయం ఏడు గంటల వరకు అందుబాటులో ఉండాలి. వారు అక్కడ వాకింగ్, జాగింగ్, వర్కౌంట్లు వంటివి చేసుకోవచ్చు. కానీ రింకూ దగ్గా పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు తన భర్తతో కలిసి స్టేడియంకు వచ్చారు. రింకు దగ్గా ఆదేశాలతో స్టేడియం నిర్వాహకులు క్రీడాకారులకు అందుబాటులో ఉండాల్సిన సమయాన్ని ఆమె స్వాధీనం. అంటే ఏడుగంటలకు ముందే వారిని స్టేడియం నుంచి పంపించేశారు. వారిని పంపించివేశాక ఆమె తన భర్త, పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ చేయటం వివాదంగా మారింది. ఈ విషయంపై మీడియాలో ప్రసారాలు కూడా జరిగాయి. సోషల్ మీడియాలో ఓ ఐఏఎస్ అధికారి కోసం క్రీడాకారుల్ని పంపిచేస్తారా..? అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇటువంటి పరిణామాలతో రింకూ దగ్గా తన ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.
కాగా..రింకు దగ్గా 1994కు చెందిన బ్యాచ్ కు చెందినవారు. (అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం మరియు కేంద్రపాలిత ప్రాంతం) కేడర్ అధికారి. ఆమె భర్త సంజీవ్ ఖిర్వార్ 1994 బ్యాచ్ కు చెందిన అధికారి. ఈయన గత ఏడాది ఢిల్లీ నుంచి బదిలీ చేయబడ్డారు. ఢిల్లీ ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సంజీవర్ ఖిర్వార్ ను లద్దాఖ్ కు బదిలీ చేయగా. రింకు దగ్గా అరుణాచల్ ప్రదేశ్ లోని స్వదేశీ వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్టరీగా నియమించారు. ఈక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ లో రింకు విధులు నిర్వహిస్తుండగా గత ఏడాది ఢిల్లీలో జరిగిన ఘటన నేపథ్యంలో ఆమె ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
త్యాగరాజ్ స్టేడియంలోని సౌకర్యాలను రింకు దగ్గా దంపతులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నుండి నివేదికను అందుకుంది. తన పదవికి రాజీనామా చేయాలనే ఆదేశాలను అందుకున్నారు.