Tamil Nadu: కన్నతండ్రే కిరాతకుడు.. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికకు ప్రసవం

కన్నతండ్రే కాటేశాడు. కంచే చేను మేసినట్లు మానవత్వం మరిచి.. బంధాల విలువలను తుంగలో తొక్కి కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ బాలిక గర్భం దాల్చి పది నెలల తర్వాత ప్రసవించింది.

Tamil Nadu: కన్నతండ్రే కిరాతకుడు.. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికకు ప్రసవం

Girl

 

Tamil Nadu: కన్నతండ్రే కాటేశాడు. కంచే చేను మేసినట్లు మానవత్వం మరిచి.. బంధాల విలువలను తుంగలో తొక్కి కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ బాలిక గర్భం దాల్చి పది నెలల తర్వాత ప్రసవించింది. ఈ ఘటన తమిళనాడులోని వేలూరు జిల్లాలో జరిగింది.

ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికకు ఉన్నట్టుండి కడుపులో నొప్పులు రావడంతో అంతా షాక్ అయ్యారు. బంధువుల సహకారంతో బాలికను ప్రభుత్వ వేలూరు మెడికల్ కాలేజీకి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యుడు బాలిక గర్భిణీ అని కన్ఫామ్ చేశారు. అలా మంగళవారం ఆగష్టు 2న మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఘటన గురించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించారు. వేలూరు మహిళా పోలీసులు కంప్లైంట్ నమోదు చేసి విచారణ చేపట్టారు. పది నెలలుగా తనపై తండ్రి జరుపుతున్న లైంగిక దాడి గురించి వివరించింది.

Read Also : కన్నకూతుళ్లపై లైంగిక దాడి చేసిన కసాయి తండ్రి

తన తల్లీతండ్రి విడిపోవడంతో సోదరుడితో కలిసి నానమ్మతాతయ్యలతో పాటే ఉంటుంది బాలిక. ప్రతిరోజు వండిన అన్నం తీసుకెళ్లడానికి తండ్రి దగ్గరకు వెళ్తుండేది. ఆహారం తీసుకెళ్లిన ప్రతిసారి తనపై అత్యాచారం జరిపేవాడని విచారణలో వెల్లడించింది. ఇదంతా ఎవరికైనా చెప్తే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తండ్రి బెదిరించాడని చెప్పింది.

ఆమె స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు.. జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పోలీసుల కస్టడీలోకి తీసుకున్నారు. పొక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల ప్రకారం.. అతనిపై కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.