10 వేలు కాదు 20 వేలు కాదు.. ఏకంగా లక్షకు పైనే.. హైదరాబాద్ లో ఉన్న అక్రమ నిర్మాణాల సంఖ్య ఇది. ఒక్క సిటీలోనే ఇన్ని ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉండి ఉంటాయి. మిగతా చోట్ల పెద్దగా ప్రమాదాలు జరగవు కాబట్టి.. వాటి మీద చర్చ తక్కువగా జరుగుతోంది.
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ ప్రకటన విడుదల చేసింది. 5,6వ అంతస్తులకు అనుమతి లేదని జీహెచ్ఎంసీ అధికారులు ధృవీకరించారు. రేపు ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించనున్నారు.
హైదరాబాద్ కూకట్ పల్లిలో భవన స్లాబ్ కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ విచారణ ప్రారంభించింది. జీ+2 కు మాత్రమే అనుమతి ఉందని బల్దియా అధికారులు చెబుతున్నారు.
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయటానికి విధివిధానాలను రూపొందించేందుకు కేంద్రం 8మంది సభ్యులతో ఓ కమిటీని నియమించింది. రక్షణశాఖ, తెలంగాణ మున్సిపల్
సుమారు 100 మీటర్ల దూరం నాలా కుంగిపోయి పూర్తిగా కూలిపోయింది. ఆ సమయంలో కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులకు గాయాలయ్యాయి. నాలాపై రెండు మూడు సార్లు రోడ్డు వేయడంతో ఆ బరువుకి కూలిపోయి ఉంటుందని, జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ లోపం కూడా స్పష్టంగా కనిపిస�
ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న నంద కుమార్కు చెందిన హోటల్ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. దీనిపై నంద కుమార్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఆన్లైన్ సిటిజన్ పర్సెప్షన్ సర్వేలో నగర ప్రజలు చురుగ్గా పాల్గొనాలని జీహెచ్ఎంసీ గురువారం కోరింది. తద్వారా హైదరాబాద్ను దేశంలోని 264 నగరాల్లో అగ్రస్థానంలో నిలపాలని సూచించింది.
హైదరాబాద్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది.
మున్సిపల్ చట్టానికి పలు సవరణలు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీలో 5 నుంచి 15 మందికి కోఆప్షన్ సభ్యులను పెంచుకోవడానికి చట్టం తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో అవిశ్వాసం పెట్టడాన్ని 3 నుంచి 4ఏళ్లకు పెంచడానికి న�
హైదరాబాద్ GHMC ఫేక్ ఫింగర్ ప్రింట్స్ కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గోషామహల్ ఎస్ఎఫ్ఏ వెంకటరెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.