Home » Matti Manishi
రసాయన ఎరువులతో సాగు చేసే భూములు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. రసాయనాలకు బదులు వర్మీ కంపోస్టు ఎరువులు వాడితే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.
దీంతో మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేయాలని నిచ్చయించుకొని గత ఏడాది నుండి బోడ కాకరను ఎత్తుమడులపై మల్చింగ్ వేసి, స్టేకింగ్ విధానంలో అర ఎకరంలో సాగుచేస్తున్నారు రైతు జంగం భూమన్న. నాటిన రెండో నెల నుండి పంట దిగుబడి ప్రారంభమవుతుంది.
వాణిజ్యపరంగా సాగుచేసే పూలలో బంతి ముఖ్యమైనది. పండుగలు, శుభకార్యాల సమయంలో వీటికి మంచి గిరాకీ ఉంటుంది. బంతిపూల పంటకాలం 120రోజులు కాగా, నాటిన 55 నుండి 60 రోజుల నుంచే దిగుబడి మొదలవుతుంది.
ఖర్చులు పెరిగిపోయి, సాగు పట్ల నిరాశ వ్యక్తంచేస్తున్న తరుణంలో గత పదేళ్లుగా అందుబాటులోకి వచ్చిన అనేక కొత్త వంగడాలు రైతులకు నూతన జవసత్వాలను కల్పిస్తున్నాయి.
పశువులను పీడించే పరాన్నజీవులు. ఇవి సోకడానికి ముఖ్య కారణం గోమార్లు, పిడుదులు , ఈగలు, దోమలు. ఇవి పాడిపశువులను పీడించి రక్తం పీల్చడంతో పాటు పాకను ఆక్రమించి కుట్టి బాధిస్తుంటాయి.
పెరుగుదల దశలో వున్న పైరులో రైతులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య కాండంతొలుచు పురుగు. నారు మడి దశ నుండి కంకితయారయ్యే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించే ఈ పురుగు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
కాకర అనగానే అందరికీ చేదే గుర్తుకొస్తుంది. కానీ పందిరి జాతి కూరగాయలలో కాకరకు విశిష్టమైన స్థానం ఉంది. అధిక దిగుబడినిచ్చే సంకర జాతి రకాలు, స్థిరమైన మార్కెట్ అందుబాటులో ఉండడం వల్ల కాకర సాగు ఎంతో లాభదాయకంగా మారింది.
తక్కువ సమయంలోనే పంట దిగుబడులు చేతికి రావడం, అదికూడా నిరంతరంగా ఉండటంతో ప్రతిరోజు డబ్బులు వస్తున్నాయంటున్నారు రైతు శ్రీనివాస్. సంప్రదాయ పంటలతో పోలిస్తే కూరగాయ పంటలే మేలంటున్నారు.
మొక్కల మధ్య దూరాన్ని వృధా చేయడం ఇష్టం లేక అంతర పంటలుగా అరటి, మునగ, చింత, జామ, మామిడి, బొప్పాయి, స్టార్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, మల్బరి, ఫల్సా లాంటి పలు రకాల పండ్ల మొక్కలను నాటారు.
రుతుపవనాలు రాక ఆలస్యం కావడంతో.. పత్తి, సోయా పంటల సాగుకూడా అలస్యమైంది. చాలా వరకు మొదటి దఫా ఎరువులను కూడా వేశారు. అయితే కొంత బెట్ట వాతావరణ పరిస్థితుల తరువాత.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటకు మేలు చేస్తున్నాయి.