Home » Pandit Nehru bus stand
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో బస్సు ప్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లింది. 12వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై నిలుచున్న ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి.
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో బీభత్సం సృష్టించిన ఆర్టీసీ బస్సు ముగ్గురు ప్రాణాల్ని బలి తీసుకుంది. బస్సు ప్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా బస్సు చక్రాల కింద పడి పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను చికిత్స కోసం అధికారులు ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.