ఏపీలో కొత్తగా 295 కరోనా కేసులు…కోలుకున్నది 368 మంది

295 new corona cases in AP : ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 295 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 59,410 శాంపిల్స్ ను పరీక్షించారు. కరోనా వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు.
గడిచిన 24 గంటల్లో 368 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 1,21,64,531 శాంపిల్స్ ను పరీక్షించారు. రాష్ట్రంలో 8,84,171 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఏపీలో మొత్తం 2,822 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,74,223 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి ఇప్పటివరకు 7,126 మంది మరణించారు.