AP Covid-19 Update : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 334 కోవిడ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 334 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.
- chvmurthy
- Published On : January 4, 2022 / 05:42 PM IST
ap covid updates
AP Covid-19 Update : ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 334 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. నిన్న 95 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఒకరు కోవిడ్ వల్ల మరణించారు.
Also Read : COVID 19 Cases: ఒక్కరోజే 5వేల 5వందల కేసులు.. 80శాతం ఒమిక్రాన్!
రాష్ట్రంలో ఇంతవరకు 3,14,25,946 మంది శాంపిల్స్ పరీక్షించగా 20,77,942 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. వీరిలో 20,61,927 మంది కోలుకున్నారు. ఇంతవరకు కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 14,499 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,516 యాక్టివ్ కోవిడ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.
