Cm Chandrababu Naidu : విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఉదయం ఆయన గుంతలు పూడ్చే కార్యక్రమానికి అనకాపల్లిలో శ్రీకారం చుట్టారు. అనంతరం సీఎం చంద్రబాబు రుషికొండ వెళ్లారు. రుషికొండలో నిర్మించిన భవనాలను చంద్రబాబు పరిశీలించారు. ప్యాలెస్ లో తిరుగుతూ నిర్మాణాలను స్వయంగా పరిశీలించారు చంద్రబాబు. ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలి, ఏ కార్యక్రమాలకు వాడుకోవాలి అనే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. దానికి సంబంధించి భవనాలను పరిశీలించాలని చంద్రబాబు అనుకున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఆయన రుషికొండ చేరుకున్నారు. అక్కడ నిర్మించిన భవనాలను పరిశీలించారు. ప్రతి భవనాన్ని స్వయంగా చూశారు.
ఈ భవనాలను ఎలా ఉపయోగించాలి అనే అంశంపై చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. దాదాపు 500 కోట్ల రూపాయలతో గత వైసీపీ ప్రభుత్వం రుషికొండలో ఈ విలాసవంతమైన భవనాలను నిర్మించింది. ఈ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. రుషికొండను మొత్తం తవ్వేసి నిర్మాణాలు చేస్తున్నారని వివాదం చెలరేగింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. రుషికొండ భవనాల వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపింది. ఇప్పుడు ఈ భవనాల నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి అనేదానిపై చంద్రబాబు సర్కార్ సమాలోచనలు చేస్తోంది.
Also Read : చంద్రబాబు చెప్పింది ఎంటి? అక్కడ జరుగుతున్నది ఏంటి?: బొత్స సత్యనారాయణ