AP Covid cases Updates : ఏపీలో కరోనా విలయం.. 11వ రోజూ 10వేలపైనే కేసులు..

  • Publish Date - September 6, 2020 / 09:40 PM IST

AP covid cases Live Updates : ఏపీలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. వరుసగా 11వ రోజు కూడా 10 వేలకు పైగా కరోనా పాజిటివ్ నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 72,573 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. 10,794 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.



రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 4,98,125కు చేరాయి.రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు స్వల్పంగా తగ్గాయి. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 70కి తగ్గిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,417కు చేరింది.



గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 9 మంది, అనంతపురంలో 8 మంది, గుంటూరులో 8 మంది, ప్రకాశంలో 8 మంది, కడపలో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, కర్నూలులో నలుగురు, నెల్లూరులో నలుగురు, శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించారు.

ట్రెండింగ్ వార్తలు