కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్ డౌన్ సడలింపు కు కొన్ని అదనపు గైడ్ లైన్స్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనల మేరకు ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ రూపోందించింది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం వ్యవసాయ రంగం, హార్టికల్చర్ పనులకు మినాహాయింపు ఇచ్చింది. ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ కు మినహాయింపు ఇచ్చారు.
ఆర్థిక రంగానికి కూడా మినహాయింపు కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనుల తో పాటు పవర్ లైన్స్, టెలికం కేబుల్స్ పనులకు అనుమతి ఇచ్చారు. కొన్ని షరతులతో ఈ కామర్స్ కంపెనీలకు, వారు వాడే వాహనాలకు పెర్మిషన్ ఇచ్చారు. వలస కార్మికులను రాష్ట్రం పరిధిలో వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పని చేసుకునేందుకు అనుమతి కల్పించారు. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే ఈ మినహాయింపు ఉంటుంది. వలస కార్మికులు లాక్ డౌన్ సమయంలో ఏ రాష్ట్రం లో ఉంటే అదే రాష్ట్రం లో మాత్రమే పనులకు అనుమతి ఉంటుంది.
బుక్ షాపు లకు అనుమతి ఇచ్చారు. అదే విధంగా ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ షాపులకు మినహాయింపు కల్పించారు. ఓడల కు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే షాపులు, మార్కెట్ కాంప్లెక్స్ లను తెరుచుకోటానికి అనుమతి కల్పించారు.