CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పిన ఏపీ సర్కారు
ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు అకౌంట్లలో జమచేసింది ప్రభుత్వం.

CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు గుడ్న్యూస్. ఏపీ సర్కారు మొదటి విడత డీఏ బకాయిలను విడుదల చేసింది. డీఏ ఎరియర్స్ ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ ఉద్యోగులకు జమ అవుతున్నాయి.
త్వరలోనే మిగిలిన సీపీఎస్ ఉద్యోగులందరికీ 90% బకాయిలు నగదుగా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు ఆరు విడుతలుగా ఈ మొత్తం చెల్లింపునకు నిర్ణయం తీసుకున్నారు. (CPS Employees)
Also Read: విద్యార్థులకు గుడ్న్యూస్.. తెలంగాణలో దసరా సెలవులపై రాష్ట్ర సర్కారు ప్రకటన.. ఎప్పటినుంచంటే?
ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి రూ.40 వేలు నుంచి రూ.70 వేల వరకు నేడు అకౌంట్లకు జమచేసింది ప్రభుత్వం. మిగిలిన వారికి 6 విడతల్లో ఒక్కో ఉద్యోగికి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
డీఏ బకాయిల విడుదల పట్ల ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.