AP Cps Employees: సీపీఎస్‌ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్‌.. ఫ్యామిలీ పెన్షన్ సమస్య పరిష్కారం..11 వేల మందికి లబ్ధి..

ఆంధ్రప్రదేశ్‌లోని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(AP Cps Employees) ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ చంద్రబాబు ప్రభుత్వం తీపి కబురు అందించింది.

AP Government resolves the family pension issue for CPS employees.

  • సీపీఎస్ ఉద్యోగులకు తీపి కబురు.
  • ఫ్యామిలీ పెన్షన్ సమస్య పరిష్కారం.
  • పదకొండు వేల మందికి లబ్ధి.

AP Cps Employees: ఆంధ్రప్రదేశ్‌లోని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (AP Cps Employees) ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ చంద్రబాబు ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత తొమ్మిదేళ్లుగా, అంటే 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న వెటరన్, ఫ్యామిలీ సీపీఎస్ కంట్రిబ్యూషన్ అంశంపై ప్రభుత్వం పూర్తి స్పష్టతనిచ్చింది. ఉద్యోగుల గ్రాట్యుటీకి అనుగుణంగా వారి కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్‌ను మంజూరు చేయాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 11 వేల మంది సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది.

Andhra Pradesh Cabinet: ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్.. నిరుద్యోగులకు సర్కారు గిఫ్ట్

ఉద్యోగ వర్గాల్లో ఎంతో కాలంగా నానుతున్న ఓఎం నంబర్ 57 (OM No. 57) అమలుకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తుపై ధీమా కల్పించేలా ప్రభుత్వం అడుగులు వేయడం పట్ల ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(AP Govt), ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌లకు సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ఈ నిర్ణయం ద్వారా నిరూపించుకుంది. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ వివాదానికి ముగింపు పలకడం ఉద్యోగ వర్గాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నిర్ణయం సీపీఎస్ ఉద్యోగుల సామాజిక భద్రతను మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.