×
Ad

AP Corona : ఏపీలో కొత్తగా 301 కరోనా కేసులు.. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో..

ఏపీలో గడచిన 24 గంటల్లో 36వేల 373 కరోనా పరీక్షలు నిర్వహించగా, 301 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 63 కొత్త కేసులు నమోదు కాగా

  • Published On : November 4, 2021 / 07:49 PM IST

Ap Corona Cases

AP Corona : ఏపీలో గడచిన 24 గంటల్లో 36వేల 373 కరోనా పరీక్షలు నిర్వహించగా, 301 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 63 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 53, విశాఖ జిల్లాలో 41, కృష్ణా జిల్లాలో 39, పశ్చిమ గోదావరి జిల్లాలో 26, గుంటూరు జిల్లాలో 24 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం, అనంతపురం జిల్లాలలో 3 కేసుల చొప్పున గుర్తించారు.

CIBIL Score : మీకు సిబిల్ స్కోరు లేదా? అయినా రుణం తీసుకోవచ్చా? ఎలానంటే?

అదే సమయంలో 367 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో ఇద్దరు కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,388కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,67,556 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,49,338 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి.