Ap Corona
AP Corona Bulletin: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 9,580 కరోనా పరీక్షలు నిర్వహించగా 49 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 19 కొత్త కేసులు నమోదయ్యాయి. కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో మరో 56 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజు వ్యవధిలో కరోనాతో మరణాలేవీ సంభవించలేదు.
ఏపీలో ఇప్పటివరకు 23,19,230 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 23,03,989 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 511 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో కరోనాతో 14వేల 730 మంది మరణించారు. నేటి వరకు రాష్ట్రంలో 3,33,32,416 కోవిడ్ టెస్టులు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 8,081 కరోనా పరీక్షలు నిర్వహించగా 40మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(AP Corona Bulletin)
దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొన్ని రోజులుగా 3 వేల దిగువనే నమోదువుతున్న కొత్త కేసులు.. తాజాగా 1700కు దిగిరావడం మరింత ఊరట కలిగిస్తోంది. అయితే మరణాల్లో మాత్రం హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,31,973 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,761 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. అంతకుముందు రోజు 71 మరణాలు నమోదు కాగా.. నిన్న 127 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్ తో మృతి చెందిన వారి సంఖ్య 5,16,479కి చేరింది.(AP Corona Bulletin)
China Covid-19 Deaths : చైనాలో కరోనా విలయం.. రెండేళ్ల తర్వాత మొదలైన కరోనా మరణాలు..!
నిన్న మరో 3వేల 196 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 4.24 కోట్లు దాటి ఆ రేటు 98.74 శాతానికి పెరిగింది. రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం 26వేల 240(0.06%) యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. నిన్న 15,34,444 మంది టీకాలు వేయించుకోగా.. నేటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 181 కోట్లు దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
అయితే, కరోనా మహమ్మారి ఇంకా అంతం కాలేదు. కరోనా ఇంకా మనతోనే ఉంది. వైరస్ తీవ్రత కాస్త తగ్గింది అంతే. ఏ క్షణమైనా దేశంలో కరోనా విజృంభించే ఛాన్స్ లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. కరోనా తీవ్రత తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉప్పెనలా విజృంభించవచ్చు అంటున్నారు. వాస్తవానికి కరోనా నాల్గో వేవ్ ముప్పు పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆగ్నేయాసియా దేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇజ్రాయెల్లో కొత్త వేరియంట్ బయటపడటం, చైనా, దక్షిణ కొరియా దేశాల్లో కరోనా తీవ్రత పెరగడం.. లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి రావడం బెంబేలెత్తిస్తోంది.
కరోనా కారణంగా పరిస్థితులు మళ్లీ దారుణంగా మారిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోంది. కరోనా కేసులు తగ్గాయని సామాజిక దూరం, మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగేస్తున్నారంటూ కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర దేశాల్లో కరోనా విజృంభణను ప్రస్తావిస్తూ దేశంలో పలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దని అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఐదు దశల స్ట్రాటజీ.. టెస్ట్, ట్రాక్, ట్రీట్, అవసరమైన చర్యలు, వ్యాక్సినేషన్ వంటివి తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది.
#COVIDUpdates: 20/03/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,19,230 పాజిటివ్ కేసు లకు గాను
*23,03,989 మంది డిశ్చార్జ్ కాగా
*14,730 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 511#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/29D3ktbNDs— ArogyaAndhra (@ArogyaAndhra) March 20, 2022