Chandrababu Naidu
బాపట్ల జిల్లా పర్చూరు నియోజక వర్గం ఇంకొల్లులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ.. సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో తాను, పవన్ కల్యాణ్ సహా అందరమూ బాధితులమే అయ్యామని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని, ఇంకా దీనిపై ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. ధైర్యం ఉంటే పర్చూరు సభకు వచ్చిన జనాన్ని చూడాలని జగన్కు సవాలు విసిరారు. ఈ జనాన్ని చూస్తే జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయని చెప్పారు.
సభకు భూమి ఇచ్ఛిన రైతును అభినందిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. మరో 53 రోజులే జగన్ పాలన ఉంటుందని చెప్పారు. అడ్డు వస్తే తొక్కుకున పోవడానికి తాను సిద్ధమని చెప్పారు. వైసీపీని భూస్థాపితం చేసేందుకు అందరూ సిద్ధమా అని ప్రశ్నించారు. తన అనుభవం ముందు జగన్ ఒక బచ్చా అని అన్నారు. ఎన్నికలకు ముందే టీడీపీ విజయం ఖాయమైందని తెలిపారు.
చంద్రబాబు కామెంట్స్
Read Also: నారా లోకేశ్ ఆ కుర్చీని మడతపెట్టడంపై పేర్ని నాని ఆసక్తికర కామెంట్స్