Chandrababu: ముంబై నటిపై కేసు వ్యవహారంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

అందరి సమక్షంలోనే ఇప్పటి వరకూ హాస్టల్ మొత్తం చేసిన తనిఖీల్లో ఎలాంటి పరికరాలు లభించలేదని చంద్రబాబు నాయుడు అన్నారు.

ముంబై నటిపై కేసు వ్యవహారంలో అప్పటి పోలీసులు వ్యవహరించిన తీరు ఏపీ ప్రతిష్ఠను మంటగలిపిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహరంలో తప్పు చేసిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించబోమని చెప్పారు.

మహిళల భద్రతకు టీడీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. గుడ్లవల్లేరు కళాశాలలో హిడెన్‌ కెమెరాలు పెట్టినట్టుగా వచ్చిన ఆరోపణలతో విద్యార్థినులు భయాందోళనలకు గురయ్యారని, ప్రభుత్వం సకాలంలో స్పందించి అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేసిందని చెప్పారు.

అందరి సమక్షంలోనే ఇప్పటి వరకూ హాస్టల్ మొత్తం చేసిన తనిఖీల్లో ఎలాంటి పరికరాలు లభించలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. అయినప్పటికీ దర్యాప్తును కొనసాగిస్తామని తెలిపారు. కొన్ని ప్రచారాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ధైర్యంగా ఉండాలని అన్నారు.

తప్పుడు పనులు చేసిన ఎవరినీ కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కాగా, వైసీపీలో ఇమడలేక చాలా మంది టీడీపీలోకి వస్తామంటున్నారని తెలిపారు. అందరినీ కాకుండా మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే తమ పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు.

Also Read: ముంబై నటి కేసు.. అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు