Minister Roja On Data Theft : చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం.. డేరా బాబా కన్నా డేంజరస్-మంత్రి రోజా

డేటా దొంగ చంద్రబాబు.. డేరా బాబా కంటే డేంజరస్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. జీవితాంతం జైల్లోనే ఉండాలన్నారు.

Minister Roja On Data Theft : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా. డేటా దొంగ చంద్రబాబు.. డేరా బాబా కంటే డేంజరస్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగిందని మంత్రి రోజా అన్నారు. చంద్రబాబు.. డేటా దొంగ అని విమర్శించారు. డేరా బాబా కంటే డేటా దొంగ చాలా డేంజరస్ అని చెప్పారు. ప్రజా సాధికారత సర్వే పేరుతో సేవా మిత్ర ద్వారా టీడీపీ నాయకులకు విలువైన సమాచారాన్ని అందించారని రోజా తెలిపారు. ప్రజల డేటాను సేవా మిత్ర ద్వారా టీడీపీ చౌర్యం చేసిందన్నారు.

డేటా చౌర్యం అంశంపై వేసిన హౌస్ కమిటీ తన రిపోర్టును ఇవ్వగానే టీడీపీ నేతల గుండెలు జారిపోయాయని రోజా అన్నారు. డేటా చోరీ అంశంపై చంద్రబాబు కోర్టులో స్టే తెచ్చుకోకపోతే జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. చంద్రబాబు జీవితాంతం జైల్లోనే ఉండాలన్నారు. దాదాపు 30 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించాలని దుర్మార్గపు ఆలోచన చేశారని ఆరోపించారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాపింగ్ చేయించి, వారిని బ్లాక్ మెయిల్ చేసి టీడీపీలో చేర్చుకున్నారని మంత్రి రోజా చెప్పారు.

Ap Assembly: టీడీపీ హయాంలో డేటా చోరీ వాస్తవమే .. శాసనసభకు సభా సంఘం మధ్యంతర నివేదిక

నారా లోకేశ్ ఒళ్లు తగ్గించుకోవడానికి ఏవేవో చేశారని… బుర్రలో గుజ్జును పెంచుకోవడానికి కూడా ఏదైనా చేస్తే బాగుంటుందని రోజా ఎద్దేవా చేశారు. అన్న క్యాంటీన్లు ఎన్ని పెట్టారో చర్చకు సిద్ధమా? అని ఆమె సవాల్ విసిరారు. చంద్రబాబు ఏ ఒక్క పథకాన్ని కూడా సొంతంగా అమలు చేయలేదని అన్నారు. టీడీపీ నేతలకు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు రోజా.

పెళ్లి కానుకతో ఎక్కువ మేలు చేసింది సీఎం జగనే అన్నారు మంత్రి రోజా. చంద్రన్న కానుకల పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారని రోజా ఆరోపించారు. అమ్ముడుపోని నెయ్యిని చంద్రన్న కానుకలో చేర్చారని అన్నారు. చిన్నవాడైనా, మొదటి సారి ముఖ్యమంత్రి అయినా ప్రజలను అభిమానిస్తాడు కాబట్టి, తల్లుల కష్టాన్ని గుర్తించి, పిల్లలకు కూడా భవిష్యత్తు ఉండాలని సీఎం జగన్ అమ్మఒడి తీసుకొచ్చారు. టీడీపీ నేతలను మెంటల్ ఆసుపత్రిలో చేర్చేందుకు జనం ఉత్సాహంగా ఉన్నారని మంత్రి రోజా అన్నారు. సున్నా వడ్డీ ఎగ్గొట్టిన దౌర్భాగ్యుడు చంద్రబాబు అని ఆమె ధ్వజమెత్తారు. కళ్లుండి కూడా చూడలేకపోతున్నారు అని టీడీపీ నేతలపై ఆమె ఫైర్ అయ్యారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఒక్క మంచి పథకాన్ని కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు.

”ఎన్టీ రామారావు తన రెక్కల కష్టంతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అనేక సంక్షేమ పథకాలతో ప్రజల ఆశీస్సులు పొందారు. అలాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడిచి, ఆయన పార్టీని లాక్కుని, ఆయన తీసుకొచ్చిన అన్నింటికి తూట్లు పొడిచింది చంద్రబాబు కాదా?

Data Theft Committee Report : డేటా చౌర్యం కమిటీ నివేదిక సిద్ధం.. రేపు అసెంబ్లీ ముందుకు 85 పేజీల రిపోర్టు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా.. పేదల తలరాతలు మార్చే విధంగా ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి పథకాలు తీసుకొచ్చారు. పేదలు అప్పుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. అలా ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారు వైఎస్ఆర్.

ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు.. వాటన్నింటిని కోతలు విధించారు. ఒక్క సొంత పథకం కూడా లేని చంద్రబాబు.. తన పథకాల పేర్లను జగన్ మార్చాడని అనడం హాస్యాస్పదం. ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తిరిగి ఏపీ వైపు చూస్తున్నారంటే జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు.. తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలు.. చేస్తున్న విప్లవాత్మక మార్పులే కారణం. వీటిని చూసి ఇతర ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. అది చూసి టీడీపీ వాళ్లు సిగ్గుపడాలి” అని మంత్రి రోజా అన్నారు.

ట్రెండింగ్ వార్తలు