Chandrababu Met Pawan: పవన్ కళ్యాణ్ భుజానికి సర్జరీ.. ముంబయి వెళ్లి కలిసిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబయి వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Chandrababu Met Pawan)ను పరామర్శించారు.
- V Santhosh Kumar
- Published on- July 12, 2026 / 05:38 PM IST
CM Chandrababu met Pawan Kalyan in Mumbai following surgery
- ముంబయిలో పవన్ పరామర్శ
- కుడి భుజానికి శస్త్రచికిత్స
- త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Chandrababu Met Pawan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబయి వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను పరామర్శించారు. ముంబయిలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో పవన్కు శనివారం కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు(Chandrababu Met Pawan) నేరుగా హాస్పిటల్కు వెళ్లి, అక్కడ చికిత్స పొందుతున్న పవన్ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్థీవాలా ఆధ్వర్యంలోని నిపుణుల బృందం పవన్ కల్యాణ్కు ఈ ఆపరేషన్ నిర్వహించింది. ఆయన భుజానికి రొటేటర్ కఫ్ గాయంతో పాటు అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో ఈ సర్జరీ అనివార్యమైంది. గత ఏప్రిల్లో పవన్కు జరిగిన ముక్కు శస్త్రచికిత్స సమయంలోనే రెండు భుజాల మజిల్ టేర్స్ తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించి, సర్జరీకి సూచించారు. ఇందులో భాగంగానే ఇప్పుడు కుడి భుజానికి ఆపరేషన్ జరగ్గా, మరికొన్ని రోజుల తర్వాత ఎడమ భుజానికి కూడా మరో శస్త్రచికిత్స చేయనున్నట్లు సమాచారం.
