విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. కూటమి అభ్యర్థి అతడే?

వైసీపీ అభ్యర్థిగా ఇప్పటికే బొత్స సత్యనారాయణ పేరు ఖరారు కావడంతో కూటమి తరుపున అభ్యర్థిని బరిలోకి దింపాలని టీడీపీ నిర్ణయించింది.

Visakha Mlc Election : ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఉండవల్లి నివాసంలో విశాఖ జిల్లా నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. వైసీపీ అభ్యర్థిగా ఇప్పటికే బొత్స సత్యనారాయణ పేరు ఖరారు కావడంతో కూటమి తరుపున అభ్యర్థిని బరిలోకి దింపాలని టీడీపీ నిర్ణయించింది. ఇవాళ్టి భేటీలో కూటమి తరుపున ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేసే ఛాన్స్ ఉంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పీలా గోవింద్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

Also Read : సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు..! కేతిరెడ్డిలో సడెన్‌గా ఎందుకింత మార్పు, ఆ పార్టీలో చేరతారా?

ట్రెండింగ్ వార్తలు