తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్
- murthy
- Published On : November 20, 2020 / 01:59 PM IST
CM YS Jagan inaugurated tungabhadra pushkarams : పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కర్నూల్ లోని సంకల్భాగ్ ఘాట్లో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. కాగా.. కోవిడ్ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆర్భాటాలు లేకుండా సంప్రదాయరీతిలో, శాస్త్రోక్తంగా నిర్వహించి పుష్కరాలను విజయవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
https://10tv.in/tungabhadra-pushkarams-slots-up-for-online-booking-vellampalli/
పుష్కరాల్లో భద్రతకోసం ఐదువేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. కార్యక్రమంలో సీఎం జగన్ వెంట మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, గుమ్మనూరు జయరాం, కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, ఎమ్మెల్యేలు హఫీజ్ఖాన్, కంగాటి శ్రీదేవి, కాటసాని రాంభూపాల్రెడ్డి, సుధాకర్, తొగురు ఆర్థర్ ఉన్నారు.
