Ap, Ts
Huge revenue : తెలుగు రాష్ట్రాలలో మద్యం ప్రధాన ఆదాయ వనరుగా మారింది. రాష్ట్రాల ఖజానాకు లిక్కర్ ద్వారా భారీగా ఆదాయం చేకూరుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. వాణిజ్య పన్నుల రాబడుల తర్వాత అత్యధికంగా ఆదాయం అబ్కారీ శాఖ నుంచే వస్తోంది. గడిచిన కొంత కాలంగా మద్యం విక్రయం భారీగా పెరిగింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో పది నెలల్లో రెండు రాష్ట్రాల్లో 47వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో 25 వేల 238.29 కోట్లు సరుకు విక్రయించినట్టు వెల్లడించారు. 3.07 కోట్ల కేసుల లిక్కర్, 2.71 కోట్ల కేసుల బీరు అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. ఇందులో తయారీ, విక్రయదారులకు 35 నుంచి 38శాతం వాటా పోగా.. మిగిలిన మెుత్తం వ్యాట్, ఎక్సైజ్ సుంకాలు, లైసెన్స్ ఫీజుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నట్లు తెలుస్తోంది.
Telangana Liquor : లిక్కర్ స్కేల్ లో రికార్డు…డిసెంబర్ నెలలో రూ. 3 వేల 350 కోట్ల మద్యం అమ్మకాలు
ఇక ఆంధ్రప్రదేశ్లోనూ మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. 21 వేల 169 కోట్ల విలువైన సరకు అమ్ముడైందని అధికారులు ప్రకటించారు. 2.13కోట్ల లిక్కర్, 62.90 లక్షల కేసుల బీరు విక్రయం జరిగింది. ఇందులో సగటున 20శాతం అంతకంటే తక్కువ మద్యం తయారీదారుల వాటా పోగా..మిగిలిన ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది.
ఏపీలో మద్యం అమ్మకాలు కాస్త తగ్గినా…ధరలు పెంచడంతో వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో 10 వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.